logo

కలసికట్టుగా పనిచేస్తే మనదే విజయం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు అన్నారు.

Published : 01 Feb 2023 04:48 IST

జిల్లా పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎం.రాంచందర్‌రావు

మక్తల్‌ పట్టణం, న్యూస్‌టుడే : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం మక్తల్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో భాజపా జిల్లా అధ్యక్షుడు పడాకుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఇంటికి పంపించే రోజులు త్వరలో రానున్నాయన్నారు. సంస్థాగతంగా భాజపాను బలోపేతం చేయాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. పాలమూరు జిల్లా ఇన్‌ఛార్జి కాంతారావు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ నేతృత్వంలో భారత దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో కమలవికాసం ఖాయమన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు నాగూరావ్‌ నామాజీ, మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, మహమూద్‌ అలీ, సుభాష్‌చందర్‌జీ, కర్నిస్వామి, పున్నంచంద్‌ లాహోటీ, ఉడత నాగరాజు, భాస్కర్‌, ప్రభాకర్‌ వర్ధన్‌, భరత్‌, నర్సింహారెడ్డి, సత్యయాదవ్‌, నర్సన్నగౌడ్‌, వాకిటి మల్లేష్‌లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని