వితంతువులకు భరోసా
ఆసరా పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబంలో భర్త మరణిస్తే.. వితంతు పింఛను పొందాలంటే భార్య మళ్లీ దరఖాస్తు చేయాలి.
లబ్ధిదారుల గుర్తింపులో అధికారులు
న్యూస్టుడే గద్వాల న్యూటౌన్
రాజోలి : ఎంపీడీవో కార్యాలయంలో వితంతువుల
వివరాలు నమోదు చేస్తున్న ఎంపీడీవో గోవింద్రావ్
ఆసరా పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబంలో భర్త మరణిస్తే.. వితంతు పింఛను పొందాలంటే భార్య మళ్లీ దరఖాస్తు చేయాలి. కార్యదర్శులు, ఎంపీడీవో పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిస్తే ఆరు నెలలకు, ఏడాదికో ఆమెకు ఆసరా మంజూరు చేసేవారు. దీంతో వితంతువులు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేవారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పింఛను వచ్చే భర్త మరణిస్తే.. నెలలోగా భార్యకు వితంతు పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వీరిని కార్యదర్శులు గుర్తిస్తుండగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. ఇకపై మరణించిన 15 రోజుల్లో వివరాలు నమోదు చేసి పింఛను వచ్చేలా చేయనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
జిల్లాలో 12 మండలాలు, నాలుగు పురపాలికల పరిధిలో ఇప్పటికే మొత్తం 60,189 మంది పింఛనుదారులున్నారు. ఎన్నికల హామీలో భాగంగా గడిచిన ఆగస్టులో 57 ఏళ్లలోపు వారికి పింఛన్లు మంజూరు చేయడంతో అదనంగా మరో 16,123 మంది జాబితాలో చేరారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పింఛను అందుతోంది. అయితే భర్త మరణించిన వారికి పింఛను అందడం లేదనే విమర్శలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అవగాహన లేక మరణించినా వారి పేరుపై పింఛను ఖాతాలో జమవుతోంది. ఇది పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. మరికొందరు పింఛనుకు బాధిత మహిళలు కనీసం దరఖాస్తు చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మరణించిన భర్త పింఛను భార్యకు బదలాయించడం ద్వారా వారి కుటుంబాలకు మేలు జరగనుంది. ఇప్పటికే అర్హులైన వారు జిల్లాలో సుమారు 250 మందికిపైగా ఉండొచ్చని అంచనా. వీరి జాబితాను ఎంపీడీవోలు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు నివేదిస్తే అతి త్వరలో పింఛను వారి ఖాతాల్లో జమ కానుంది.
ప్రతి నెలా ఎంపీడీవో కార్యాలయంలోనే.. : మూడేళ్లుగా ప్రభుత్వం ఆసరా దరఖాస్తులను పక్కన పెట్టగా చాలా మంది వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై భర్త మృతి చెందిన వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతోపాటుగా, భార్య వివరాలతో ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా దరఖాస్తులను అందించనున్నారు. ఆయా గ్రామాల కార్యదర్శులు బాధితులను నెలవారీగా గుర్తించి లబ్ధి చేకూరేలా సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా