చిన్న వయసులో పెద్ద కష్టం
సదరం శిబిరానికి హాజరై, వైకల్య ధ్రువపత్రం పొందాలంటే ముందుగా ‘మీసేవ’లో స్లాట్ నమోదుచేయించుకోవాల్సి ఉంది.
సదరం శిబిరానికి హాజరై, వైకల్య ధ్రువపత్రం పొందాలంటే ముందుగా ‘మీసేవ’లో స్లాట్ నమోదుచేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ సమయంలో ధ్రువపత్రం పొందేవాళ్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. రెండేళ్లుగా పక్షవాతంతో ఎడమ కాలు, చెయ్యి కదపలేని స్థితిలో ఉన్న జి.పారిజాతను బుధవారం తల్లి రాములమ్మ, చిన్నాన్న జనార్ధన్, బంధువులు ఇలా ఓ దుప్పట్లో వెల్దండలోని మీసేవ కేంద్రం లోపలికి తీసుకొచ్చారు.
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే
కూలీకెళ్తే తప్ప పూట గడవని పేద కుటుంబంలో జన్మించినా.. కష్టపడి చదివి ఆరోగ్య కార్యకర్తగా శిక్షణ పొంది ఇతరులకు సేలందించిన ఓ యువతికి పక్షవాతం శాపంగా మారింది. వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమై అచేతన స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది.. వైద్యం కోసం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.. వెల్దండ మండల కేంద్రానికి చెందిన బాలయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. బాలయ్య 2017లో మృతి చెందాడు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన పారిజాత ఆరోగ్య కార్యకర్తగా శిక్షణ పొంది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా సేవలందించింది. బీఎస్సీ నర్సింగ్లో చేరి మూడో ఏడాది చదువుతుండగానే విధి వక్రీకరించింది. ఉన్నంతలో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని అనుకోని ఘటన కుదిపేసింది. 2020 జులైలో ఆకస్మికంగా పక్షవాతం బారిన పడింది. దీంతో ఆమె ఎడమచేయి, కాలు స్పర్శ లేకుండా పోయింది. కుమార్తెకు కష్టం రావడంతో కన్నీటి పర్యంతమైన తల్లి తెలిసిన చోటల్లా అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేసి హైదరాబాద్, కర్నూల్, గుర్మిట్కల్, చిత్తూరు తదితర పట్టణాల్లో వైద్యం చేయించింది. అయినా ఫలితం దక్కలేదు. మెరుగైన వైద్యం చేయించలేక ఇంటికి తరలించింది. గ్రామంలో చిన్నపాటి ఇల్లు మినహా ఆ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మందులు, ఫిజియోథెరపీ కోసం నెలకు రూ.20వేల వరకు ఖర్చు అవుతున్నాయి. పారిజాత మందులకు ఇబ్బందిగా ఉందని తల్లి రాములమ్మ కన్నీటి పర్యంతమైంది. చేసేదేమీ లేక కుటుంబపోషణకు ఆమె కొద్దిరోజులు కూలీకి వెళ్లినా.. కాలు, చేయి కదపలేని పారిజాత మంచానికే పరిమితమై కనీసం వ్యక్తిగత పనులూ చేసుకునే స్థితిలో లేక పోవడంతో ఇంట్లో ఆమెకు తోడుగా ఉండేందుకు తల్లి కూలీ పనులు మానుకుంది. తల్లే అన్నం తిన్పించడం, సమయానికి మందులు వేయడం వంటి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సోదరులు చిన్నవాళ్లు కావడంతో వాళ్లు బతకడమే కష్టంగా ఉంది. దాతలు చేయూతనివ్వాలని ఆ కుటుంబం కోరుకుంటోంది. సాయం చేయాలనుకునే వారు చరవాణి నం. 8008551780లో సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా