ఏడేళ్లుగా పనిచేయని ఎత్తిపోతలు
మక్తల్ మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాలు ఏడేళ్లుగా మూతపడ్డాయి. నీటి వనరులు ఉన్నా వర్షాధార పంటలు సాగు చేసుకొని నష్టపోతున్నామని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆయకట్టుకు సాగునీరందక అవస్థలు
న్యూస్టుడే, మక్తల్ గ్రామీణం
ముస్లాయిపల్లిలో మూతపడ్డ పంప్హౌజ్
మక్తల్ మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాలు ఏడేళ్లుగా మూతపడ్డాయి. నీటి వనరులు ఉన్నా వర్షాధార పంటలు సాగు చేసుకొని నష్టపోతున్నామని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎత్తిపోతల పథకాల ఆవిర్భావం నుంచి ఐడీసీ ద్వారా ప్రభుత్వమే నడిపించేది. 2010లో అప్పటి ప్రభుత్వం రైతులకు నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఐదేళ్లపాటు రైతులు సంఘాలుగా ఏర్పడి నడిపించారు. కాల్వల పూడికతీత పనుల మరమ్మతులకు రూ.లక్షలు వెచ్చించడం శక్తికి మించిన భారం కావడంతో 2015 నుంచి ఎత్తిపోతలు మూతపడ్డాయి. పస్పుల, ముస్లాయిపల్లి, ఎత్తిపోతల పథకాల కింద 5,300ల ఎకరాలకు సాగునీరందటం లేదు. ఐడీసీ ద్వారా నిర్వహించే ఎత్తిపోతల పథకాలను ఆయకట్టు రైతులు ఒక్కో ఎత్తిపోతలకు సంబంధించి సంఘంగా ఏర్పడి పంట కాలానికి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి 2015 వరకు ప్రయివేటు లష్కర్లను నియమించుకొని నడిపించారు. కాల్వలు పూడిక తీయక, పంప్ల మరమ్మతుకు రూ.లక్షల్లో వెచ్చించడం శక్తికి మించిన భారం అయ్యింది. ఎత్తిపోతలు నడుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2015 తర్వాత అవి మూతపడ్డాయి. ముస్లాయిపల్లి 2 ఎత్తిపోతల కింద 1600ల ఎకరాల ఆయకట్టు ఉండగా ఒక పంప్ మాత్రమే నడుపుకొని 600ల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. పస్పుల ఎత్తిపోతల కింద 3500ల ఎకరాలు, ముస్లాయిపల్లి 1 కింద 800ల ఎకరాలు, ముస్లాయిపల్లి 2 కింద వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 5300ల ఎకరాలకు సాగునీరందటం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో లిఫ్టు మరమ్మతులు చేయకపోవడంతో పొలాలకు సాగు నీరందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ పరిధిలోకి ఈ పథకాలు వచ్చినందున ఆ శాఖ అధికారులు మూతపడ్డ లిఫ్టులు ప్రారంభించి ఆయకట్టుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా లిఫ్టుల మరమ్మతులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : ముస్లాయిపల్లి 1 లిఫ్ట్ కింద 800ల ఎకరాలకు సాగునీరందక చిన్నపాటి రైతుల భూములు బీడు భూములుగా మారి రైతులు వలసబాట పడుతున్నారు. లిఫ్ట్ కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. వర్షాధార పంటలు వేసుకొని ఒక యేటా పండితే మరో యేటా పండక నష్టపోతున్నాను. ఎత్తిపోతలు నడిపించి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి.
లక్ష్మణ్, రైతు, ముస్లాయిపల్లి
నీరందక అవస్థలు : పస్పుల లిఫ్ట్ కింద సాగునీరందక వర్షాధార పంటలు సాగు చేశాను. దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పెట్టుబడులు సైతం అందక అప్పులు పెరిగిపోయాయి. నాకున్న ఐదెకరాల్లో ప్రతి ఏటా వర్షాధార పంటలు సాగు చేస్తున్నాను. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి లిఫ్ట్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
- నర్సప్ప, రైతు, పస్పుల
ఎత్తిపోతల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం : నియోజకవర్గం లోని ఎత్తిపోతలను పరిశీలించాం. పంపుల మరమ్మతులు, కాల్వల పూడిక తీతల కోసం ప్రతిపాదనలు పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
- వెంకటరమణ, డీఈ నీటిపారుదలశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు