మూత్ర పిండం దినదిన గండం
రెండు కిడ్నీలు పాడవటం అతడి కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. కుటుంబ సభ్యుల రెక్కల కష్టం అతడి వైద్య ఖర్చులకు కూడా చాలకపోవటంతో రోజులు గడవటమే గగనంగా మారింది.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకుడు
న్యూస్టుడే, జడ్చర్ల న్యూటౌన్
తల్లిదండ్రులతో దీనంగా కూర్చున్న మల్లయ్య
రెండు కిడ్నీలు పాడవటం అతడి కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. కుటుంబ సభ్యుల రెక్కల కష్టం అతడి వైద్య ఖర్చులకు కూడా చాలకపోవటంతో రోజులు గడవటమే గగనంగా మారింది. చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన యువకుడు మల్లయ్యది నిరుపేద కుటుంబం. ప్రైవేటు కోళ్ల పరిశ్రమలో పనిచేస్తూ చేస్తూ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. జీవనం హాయిగా సాగుతున్న సమయంలో విధి వక్రీకరించింది. మూడేళ్ల కిందట అనారోగ్యం పాలై ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. రెండేళ్లుగా వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారంలో మూడు రోజులు డయాలసిస్ చేయించుకునేందుకు, మందుల కొనుగోలుకు నెలకు రూ. 10వేల వరకు ఖర్చవుతోంది. కుటుంబ సభ్యులు ఇందుకు ఉన్నదంతా ఖర్చు పెట్టారు. రోజువారీగా కూలీ పనులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి కిడ్నీలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు వెంకటమ్మ, శంకరయ్య ముందుకు వచ్చినా వయస్సు పైబడినందున వారివి పనికి రావని వైద్యులు తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మల్లయ్యకు సపర్యలు చేసేందుకు భార్య ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోంది. చేతకాని వయస్సులో ఉన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో వైద్యం, మందులకు వెచ్చిస్తున్నారు. పేదరికం మెరుగైన వైద్యం చేయించుకునేందుకు అవరోధంగా మారిందని మల్లయ్య భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు చరవాణి నం. 8008551780లో సంప్రదించవచ్చు.
రాత్రి వేళ నరకమే..
మల్లయ్య, బాధితుడు
రాత్రి నిద్ర పట్టదు. రోజూ నరకం చూడాల్సి వస్తోంది. బతికి ఉన్నా ఒక్కోసారి లేనట్లే అనిపిస్తుంది. అన్నం తినేందుకు కూడా శరీరం సహకరించటం లేదు. రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నా. కుటుంబానికి భారంగా మారాను. జీవితంపై విరక్తి కలుగుతోంది. దాతలు స్పందించి ఆర్థికంగా ఆదుకుంటే వైద్యానికి ఆసరా అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!