సౌకర్యాల కల్పన ఎండమావే!
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు.
ఉపాధి కూలీలకు తప్పని అవస్థలు
అచ్చంపేట, న్యూస్టుడే
అప్పాయిపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి సమీపిస్తున్నా నిబంధనల ప్రకారం కల్పించాల్సిన వసతులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికే ఎండల తీవ్రత పెరగడంతో పనిచేసేందుకు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వీరికి గతంలో పని ప్రదేశంలో గుడారాలు ఏర్పాటు చేసేవారు. తాగునీటి వసతి, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచేవారు. కనీసం భోజన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వసతి లేక కూలీలు తంటాలు పడుతున్నారు. ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కూలీలకు నీడ కోసం కనీసం ‘గ్రీన్ షేడ్ నెట్లు’ ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. తప్పని పరిస్థితుల్లో మండుతున్న ఎండలోనే కూలీలు పనులు చేస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పాటు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడంతో కూలి సొమ్ము అధికంగా లభిస్తోంది. దాంతో వారు ఉపాధి పనులపై ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం హరితహారం నర్సరీల పనుల్లో కొందరు పనిచేస్తున్నారు.
గిట్టుబాటు కాదాయె..: ఉపాధి హామీ పథకం కింద కష్టపడి పనిచేస్తున్నా కూలి గిట్టుబాటు కావడం లేదని పలువురు కూలీలు వాపోతున్నారు. రోజుకు రూ.246 సొమ్ము అందాల్సి ఉండగా, రూ.120కి మించి రావడంలేదని వారు పేర్కొంటున్నారు. ఏడాదికి కనీసం 200 పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 చొప్పున కూలిసొమ్ము చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు దెరువు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1694 పంచాయతీల పరిధిలో 8.28 లక్షల జాబుకార్డులు ఉండగా, ఇప్పటివరకు 8 లక్షల మంది కూలీల జాబుకార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. మిగతా వాటిని ఆధార్తో అనుసంధానం చేయకపోవడంతో వారు పనులు చేసేందుకు అవకాశం ఉండదు.
ఏడేళ్లుగా అందని పరికరాలు
ఉపాధి కూలీలకు ఏడేళ్లుగా పార, గడ్డపార, తట్టలు తదితర సామగ్రి అందడం లేదు. సొంతగా వాటిని సమకూర్చుకోవడానికి వారు ఇబ్బంది పడుతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో కూలీలు తాగునీటిని వెంట తీసుకెళుతున్నారు. పనిచేసే సమయంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక సమీపంలో ఎక్కడ చెట్టు కనిపించినా.. ఆ నీడలో కొంతసేపు సేద తీరుతున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించడంతో పాటు పెండింగులో ఉన్న కూలి సొమ్మును వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం
తాము చేసిన పనికి సకాలంలో బిల్లులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. రెండు నెలలుగా అవి పెండింగులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బ్యాంక్, తపాలా శాఖల్లో ఖాతాలు ప్రారంభించి, కూలిడబ్బును వాటిలో జమ చేస్తున్నారు. ఈ విధానంలో లోపాలు ఉండడంతో ఆధార్తో అనుసంధానం చేసి నేరుగా కూలీలకు సొమ్ము అందేలా చర్యలు తీసుకొంటున్నారు.
కల్పించేందుకు చర్యలు : వేసవి సమీపిస్తున్నందున ఉపాధి హామీ పథకం కూలీలకు పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. గతేడాది గుడారాలు, మందుల కిట్లు అందజేశాం. అన్ని పంచాయతీల పరిధిలో కూలీలకు వీటిని అందుబాటులో ఉంచాలని ఏపీవోలకు సూచించాం. కూలీలకు తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెరిగేలా శ్రద్ధ తీసుకొంటున్నాం. జాబుకార్డులను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి కావచ్చింది. బిల్లులు సకాలంలో అందేలా చూస్తాం. నర్సరీల్లో మొక్కల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించి కూలీలకు పని కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నాం.
నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్కర్నూలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
[ 28-03-2024]
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్
[ 28-03-2024]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
[ 28-03-2024]
జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. -
అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 28-03-2024]
అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు -
గద్వాల పట్టణంలో భారీ చోరీ
[ 28-03-2024]
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది. -
మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
[ 28-03-2024]
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మక్తల్ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. -
నాగర్కర్నూల్ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం
[ 28-03-2024]
భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్ సభ్యుడు పి.రాములు అన్నారు. -
డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
[ 28-03-2024]
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. -
మన్యంకొండలో పూర్ణాహుతి
[ 28-03-2024]
మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో... -
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
[ 28-03-2024]
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. -
అడుగంటుతున్న వరదాయని
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. -
మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. -
చిన్నారులకు బాల ఆధార్
[ 28-03-2024]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. ఇది గుర్తింపుకార్డు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఇదే ప్రామాణికంగా మారింది. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ... -
పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
[ 28-03-2024]
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అనిశా వలలో తహసీల్దార్
[ 28-03-2024]
ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. -
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 28-03-2024]
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్