నిధులు మంజూరైనా మారని దుస్థితి
జిల్లాలో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. బీటీ రోడ్లు గుంతలు పడి ప్రయాణం నరకంగా మారింది. ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు అసలు టెండర్లు వేయడానికే ఆసక్తి చూపడం లేదు.
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్
నిధులు మంజూరైనా పనులకు నోచుకోని ధన్వాడ - పాతపల్లి రహదారి
జిల్లాలో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. బీటీ రోడ్లు గుంతలు పడి ప్రయాణం నరకంగా మారింది. ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు అసలు టెండర్లు వేయడానికే ఆసక్తి చూపడం లేదు. అధికారులు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించినా స్పందన ఉండటం లేదు. దీంతో గుంతల రోడ్ల పరిస్థితి మారక ప్రయాణికులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
రూ.22.48 కోట్లు మంజూరు..: నారాయణపేట నియోజకవర్గంలోని తొమ్మిది రోడ్లకు మరమ్మతు కోసం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.22.48 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. గత నెల మళ్లీ టెండర్లు పిలిచారు. అయినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో చేసిన రహదారుల పనులకు ఇంతవరకు బిల్లులు రాలేదని, అందుకే టెండర్లు వేయడం లేదని గుత్తేదారులు అంటున్నారు. నారాయణపేట మండలానికి చెందిన ఓ గుత్తేదారు అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు మంజూరు కాక వడ్డీలు పెరిగి భూములు అమ్ముకున్నారని కొందరు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చేపట్టాల్సిన పనులు ఇవీ..: ధన్వాడ నుంచి పాతపల్లి వరకు బీటీ మరమ్మతు పనులకు రూ.62 లక్షలు మంజూరు అయ్యాయి. నారాయణపేట నుంచి దామరగిద్ద వరకు బీటీ మరమ్మతులకు రూ.5.33 కోట్లు, నారాయణపేట రోడ్లకు ఒకసారి రూ.2.47 కోట్లు, మరోసారి కొన్ని రోడ్లకు రూ.3.50 కోట్లు, కొండాపూర్ నుంచి చర్లపల్లికి రూ.50 లక్షలు, మరికల్ బైపాస్ నుంచి ఆత్మకూరు రహదారికి రూ.80 లక్షలు మంజూరయ్యాయి. సింగారం రోడ్డు బీటీ పునరుద్ధరణకు రూ.80 లక్షలు, దామరగిద్దకు రూ.5.35 కోట్లు, మరికల్ మండలంలో పనులకు రూ.3.11 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి రెండుసార్లు, మరికొన్నింటికి మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు.
అన్ని విధాలా ప్రయత్నం..: టెండర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్ అధికారులు గుత్తేదారులకు ఫోన్చేసి మరీ కోరుతున్నారు. ఈ సారి వాట్సాప్ గ్రూపుల్లోనూ టెండర్ల ప్రక్రియ సమాచారాన్ని పెట్టారు. ఏ రోడ్డుకు ఎంతెంత నిధులు వచ్చాయి బిడ్ల ముగింపు గడువును పొందు పరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అయినా మూడోసారి టెండర్లు ఆహ్వానించినా బిడ్లు దాఖలు కావడం లేదు.
మళ్లీ టెండర్లు పిలిచాం..: గతంలో కొన్నింటికి రెండుసార్లు, మరికొన్ని పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచిన ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదు. దీంతో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 4 నుంచి 8 వరకు టెండర్లు వేయవచ్చు. ఎమ్మెల్యేతో పాటు మేము కూడా ఎంతో కృషి చేసి పనులు మంజూరు చేయించుకున్నాం. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో మొదలు పెట్టలేకపోతున్నాం. ఈసారి టెండర్లు దాఖలు అవుతాయని ఆశిస్తున్నాం
నరేందర్, పంచాయతీరాజ్ ఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.