కాలుష్యాన్ని భరించలేం.. గ్రామాన్ని వదిలేస్తాం
కాలుష్య కారక ఐరన్ పరిశ్రమను మూసివేయండి... లేదా ఇళ్లు.. పొలాలు వదులుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతామంటూ బాలానగర్ మండలం గుండేడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ కార్యాలయం, ఠాణా ఎదుట ఆందోళన
ఏఎస్సై శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు
బాలానగర్, న్యూస్టుడే : కాలుష్య కారక ఐరన్ పరిశ్రమను మూసివేయండి... లేదా ఇళ్లు.. పొలాలు వదులుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతామంటూ బాలానగర్ మండలం గుండేడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మందికి పైగా మహిళలు, పురుషులు శుక్రవారం గ్రామ సమీపంలోని ఐరన్ పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి కారణంగా గ్రామంలో నివాసం ఉండలేక పోతున్నామని, వండిన ఆహార పదార్థాలు కూడా తినలేని పరిస్థితి ఉందని కొద్ది రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. పంట పొలాలు, పండ్ల తోటలపై ఐరన్ ఓర్ దుమ్ము పేరుకుపోయి పంటలు పండటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఇటీవల సర్పంచు, గ్రామస్థులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పదిహేను రోజుల కిందట పరిశ్రమను పరిశీలించారు. ఇటీవల కూడా పరిశ్రమలో తనిఖీలు చేసిన పీసీబీ అధికారులు చర్యలు తీసుకున్న జాడేమీ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు మూడ్రోజులుగా పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం డప్పులు, బ్యాండు మోతలతో బాలానగర్ తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాలుష్య కారక పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దారు శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పోలీసు స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ధర్నా అనంతరం ఏఎస్సై శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. జీఎమ్మార్ నర్సింహులు, శ్రీనివాస్, శంకర్నాయక్, శ్రీశైలం యాదవ్, చెన్నకేశవులు, వెంకట్నాయక్, పవన్కుమార్, మల్లేష్, శ్రీనివాస్రెడ్డి, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు