మహబూబ్నగర్-మునీరాబాద్కు రూ.50 కోట్లు
రైల్వే బడ్జెట్లో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు మొండిచెయ్యే చూపారు. కొత్త రైల్వే లైన్ల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. వాటి ఊసే లేకపోవడం నిరాశకు గురిచేసింది.
కొత్త లైన్లకు దక్కని మోక్షం
డబ్లింగ్కు రూ.20 కోట్లు
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం
రైల్వే బడ్జెట్లో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు మొండిచెయ్యే చూపారు. కొత్త రైల్వే లైన్ల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. వాటి ఊసే లేకపోవడం నిరాశకు గురిచేసింది. కొత్త రైల్వే మార్గాల సర్వే అంశాల ప్రస్తావన కూడా లేకపోవడం జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుయింది. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు విదల్చకపోవడం శోచనీయం. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక రైల్వే ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం కొంత ఊరటనిచ్చేలా ఉంది. ఇటీవల పూర్తయిన సికింద్రాబాద్-మహబూబ్నగర్ డబ్లింగ్కు సైతం నిధులు కేటాయించారు. గద్వాల- మాచర్ల, వికారాబాద్- కృష్ణా, జడ్చర్ల- నంద్యాల మార్గాల ప్రతిపాదిత సర్వేలకు ఈసారి కూడా మోక్షం దక్కలేదు.
* పాలమూరులో కొనసాగుతున్న ఏకైక రైల్వే ప్రాజెక్టు మహబూబ్నగర్-మునీరాబాద్(కర్ణాటక) మార్గానికి ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయి. 246 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గం 1997-98లో మంజూరైంది. మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, జక్లేరు, ఉప్పర్పల్లి, మక్తల్, చందాపూర్, మాగనూరు, కున్సి, కృష్ణా రైల్వే స్టేషన్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్బలి నుంచి కారటిగి వరకు పనులు పూర్తయ్యాయి. ఇంకా దాదాపు 80 కిలో మీటర్ల రైలు మార్గం పూర్తి కావాల్సి ఉంది. ఈ సారి రూ.50 కోట్లు కేటాయించడంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే మరో రెండు, మూడేళ్లలో ఈ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.
* సికింద్రాబాద్- మహబూబ్నగర్ మధ్య 85 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు 2015-16లో మంజూరయ్యాయి. నాలుగు నెలల క్రితం ఈ పనులు పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్లో రూ.20కోట్లు కేటాయించారు. డబ్లింగ్తోపాటు విద్యుదీకరణ పూర్తయిన రెండో లైన్లో రైళ్లు నడుస్తున్నాయి. మహబూబ్నగర్- గద్వాల వరకు విద్యుదీకరణ సైతం పూర్తి చేశారు. గద్వాల-రాయచూరు మధ్య గతంలోనే విద్యుదీకరణ పనులు చేపట్టడంతో ఇప్పుడు హైదరాబాద్లోని మౌలాలి నుంచి నేరుగా రాయచూరు వరకు రైళ్లు విద్యుత్తు సాయంతో రాకపోకలు సాగిస్తున్నాయి. మహబూబ్నగర్-హైదరాబాద్ మధ్య దాదాపు ఏడేళ్ల తర్వాత డబ్లింగ్ పనులు పూర్తవడంతో రైళ్ల సంఖ్యను మరింత పెంచనున్నారు. ముంబయి- పుణె మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించనున్నారు.
వీటికి మోక్షమెపుడో..? : ఉమ్మడి జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్గాలకు గతంలో ప్రతిపాదించి సర్వేలు చేసినప్పటికీ ఈ బడ్జెట్లోనూ మోక్షం కలగలేదు. మాచర్ల-గద్వాల, కృష్ణా-వికారాబాద్, జడ్చర్ల-నంద్యాల కొత్త రైల్వే లైన్ల ఊసేలేదు. మాచర్ల-గద్వాల మార్గం ఏర్పాటు చేస్తే మాచర్ల నుంచి నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, గద్వాల వరకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణా-వికారాబాద్ మార్గం కోసం రెండుసార్లు సర్వే చేసి వదిలేశారు. ఈ మార్గం పూర్తయితే మద్దూరు, కోస్గి, కొడంగల్ మీదుగా వికారాబాద్కు రైలు సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా సిమెంటు రంగం వృద్ధిలోకి రానుంది. ఇక్కడ వలసలు తగ్గి ప్రజలకు పనులు దొరికే ఆస్కారం ఉంటుంది. జడ్చర్ల-నంద్యాలకు మోక్షం లభిస్తే జడ్చర్ల, నాగర్కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాలకు రాకపోకలు సాగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ