కుదరని ముహూర్తం
జిల్లా కేంద్రంలో నిర్మించాలని భావిస్తున్న ఉప రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సరైన ముహూర్తం కుదరడం లేదు.
నాలుగోసారీ నిలిచిన నిర్మాణం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి అడ్డంకులు
న్యూస్టుడే, వనపర్తి
గుట్టల మధ్య వేసిన శంకుస్థాపన శిలాఫలకం
జిల్లా కేంద్రంలో నిర్మించాలని భావిస్తున్న ఉప రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సరైన ముహూర్తం కుదరడం లేదు. పట్టణ పరిసరాల్లో భవన నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని ప్రయత్నించి కొన్ని ప్రాంతాలను ఎంపికచేసి శంకుస్థాపన శిలాఫలకాలు వేసినా నిర్మాణానికి నోచుకోలేదు. అనుమతులు వచ్చాయి.. నిధులు మంజూరయ్యాయి.. స్థలాన్ని ఎంపికచేశాం.. ఇక అన్నీ పూర్తయ్యాయి.. ఇక నిర్మాణమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఏదో ఒక ఉపద్రవం అడ్డొచి ఆగిపోతోంది. జిల్లా కేంద్రం నుంచి మూడువైపులా ఎంపిక చేసిన స్థలాలు ఆయా ప్రాంతాల్లోని స్థిరాస్తి వ్యాపారుల వెంచర్లకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వనపర్తి-కొత్తకోట రోడ్డు నాగవరం శివారులోనూ అదే దృశ్యం పునరావృతమైంది.
ఎందుకీ మార్పుచేర్పులు..
ప్రభుత్వానికి ఆదాయం, పురపాలక సంఘానికి సెస్సును అందించే ప్రధాన వనరైన రిజిస్ట్రేషను శాఖ కార్యాలయాన్ని అందరికీ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 50 ఏళ్ల కిందటే వనపర్తిలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ఏర్పాటుచేసి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి కొత్తకోట రోడ్డులోనే కార్యాలయం కొనసాగుతోంది. అయితే ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడం లేదు. ఇరుకుగా మారడంతో అదే ప్రాంతంలోని వివేకానంద చౌరస్తా సమీపంలో మొదటి అంతస్తులో అద్దె భవనంలో ఏర్పాటుచేశారు. ఇక్కడికొచ్చాక వినియోగదారులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఎగువ అంతస్తులో ఉండడంతో వృద్ధులు, మహిళలు కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇది పాత భవనం కావడంతో ఈ మధ్యనే మరమ్మతులు చేయించి ప్రస్తుతం అందులోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. భవనాన్ని సొంత స్థలంలోకి మార్చాలనే ఉద్దేశంతో ముందుగా పాన్గల్రోడ్డులోని ఓ స్థలాన్ని ఇవ్వడానికి దాత ముందుకొచ్చినా ఆయన మరో పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది.
* అనంతరం అదే మార్గంలో కొంత దూరంలో ఓ ప్రైవేటు వెంచర్ నిర్వాహకులు స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అక్కడా కుదరలేదు.
* చివరకు గోపాల్పేటరోడ్డులో ఓ వెంచర్కు సమీపంలో స్థలాన్ని ఎంపికచేసి శంకుస్థాపన కూడా చేశారు. అయితే రోడ్డు సౌకర్యం లేదని, సమీపంలోంచి విద్యుత్తు హై ఓల్టేజీ తీగలు వెళుతున్నాయనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు.
* నాలుగోసారి కొత్తకోటరోడ్డులోని ఓ వెంచరు సమీపంలోని గుట్టల మధ్య కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడుతుండడంతో పురపాలక సంఘంలోని అధికార పార్టీ కౌన్సిలర్లే అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ ప్రాంతంలో వద్దంటే వద్దంటూ పట్టుబట్టారు. పురపాలక పెద్దలు, భారాస పార్టీ పెద్దలు సముదాయించినా ససేమిరా అనడంతో పాటు పుర ఛైర్మన్, వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం ప్రతిపాదించే వరకు వివాదం సాగింది. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచన మేరకు గురువారం జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆ ప్రాంతంలో కాకుండా మెజార్టీ సభ్యులు, పట్టణ ప్రజలు కోరుకునే చోటే భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.
అవిశ్వాస అస్త్రంతో..
రిజిస్ట్రేషను శాఖ భవన నిర్మాణాన్ని కొత్తకోటరోడ్డులోని వెంచర్ సమీపంలోంచి మార్చాలని, ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తంచేస్తూ పుర వైస్ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపాదించారు. శంకస్థాపన చేసే క్రమంలోనే ఉపాధ్యక్షుడి వార్డులో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరవడంతో స్వపక్ష కౌన్సిలర్లు కినుక వహించారు. మధ్యలో ఆగినట్లే ఆగి ఆ తరవాత పనులు ప్రారంభం కావడంతో కౌన్సిలర్లు ఇతర పార్టీల వారితో చేతులు ఈసారి ఛైర్మన్, వైస్ఛైర్మన్పై అవిశ్వాస అస్త్రం సంధించాలని ప్రతిపాదించారు. పట్టణ పెద్దలు కౌన్సిలర్లను బుజ్జగించినా ససేమిరా అనడంతో మంత్రి దృష్టికి విషయం చేరింది. చివరకు ఆయన సూచనతో అంతా సద్దుమణిగింది. అనువైన స్థలాన్ని సూచించాలని మంత్రి కౌన్సిలర్లను కోరడంతో అవిశ్వాసాన్ని వీడి అంతా ఏకతాటిపైకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీఏ కార్యాలయం, లింగిరెడ్డికుంటలోని పుర కాంప్లెక్సు, నాగవరం వద్ద ప్రభుత్వ స్థలం, పాత కలెక్టరేట్ వద్ద పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయ భవనం ఇలా పలు ప్రాంతాలు తెరపైకి వస్తున్నాయి. శాసనసభ సమావేశాల అనంతరం మంత్రి వనపర్తి వచ్చాక ఎంపిక అంశం కొలిక్కిరానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?