నేర వార్తలు
మోటారుకు అడ్డొచ్చిన చెత్తను తొలగించేందుకు కాల్వలోకి దిగిన ఓ వ్యక్తి బురదలో ఇరుక్కొని ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఖాదర్ కథనం ప్రకారం..
కేఎల్ఐ కాల్వలో మునిగి వ్యక్తి మృతి
తిమ్మాజిపేట, న్యూస్టుడే : మోటారుకు అడ్డొచ్చిన చెత్తను తొలగించేందుకు కాల్వలోకి దిగిన ఓ వ్యక్తి బురదలో ఇరుక్కొని ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఖాదర్ కథనం ప్రకారం.. ఆవంచ గ్రామానికి చెందిన కౌలురైతు అమ్మపల్లి నర్సింహ (60) ఈ నెల 3న శుక్రవారం సాయంత్రం పొలంలో పనిచేసేందుకు వెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. కుటుంబికులు వెళ్లి వెదికారు. రాత్రి మోటారున్న కాల్వ వద్దకు వెళ్లి పరిశీలించగా ఒడ్డుపై తుండుగుడ్డ, చెప్పులు, కర్ర ఉండటాన్ని గుర్తించారు. శనివారం ఉదయం కాల్వ పొడుగునా మూడు కిలోమీటర్లమేర గాలించారు. మధ్యాహ్నం మోటారున్న ప్రాంతంలో కొద్దిదూరంలోనే శవమైతేలాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. నర్సింహకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృత్యువాత
లింగాల, న్యూస్టుడే : నాగర్కర్నూల్ జిల్లా అప్పాయిపల్లికి చెందిన పుట్ట నిరంజన్(38) శనివారం వేరుశనగ పంటకు స్ప్రింక్లర్ల ద్వార తడి పెట్టడానికి వెళ్లాడు. స్టాటర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తీగ చేతికి తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన ఇరుగు పొరుగు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య మల్లమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ వివరించారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
మక్తల్ గ్రామీణం, న్యూస్టుడే : మక్తల్ మండలం భగవాన్పల్లికి చెందిన పెద్ద బోయ ఆశన్న (59) పదిహేను రోజుల కిందట గ్రామంలో ఉర్సు సందర్భంగా మద్యం తాగి ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ముష్టిపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు గిరి చేపలు పట్ట్టేందుకు వాగు వద్దకు వెళ్లగా.. మృతదేహం నీటిపై తెలుతూ కనిపించింది. పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహంబోయ ఆశన్నదిగా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాగులో పడి ఉంటాడని, అతను మృతి చెంది కూడా పది రోజులకు పైగా అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య అమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పర్వతాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?