కక్షిదారులకు నాణ్యమైన సేవలు
న్యాయవాదులు, న్యాయమూర్తులు కక్షిదారులకు నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి, వనపర్తి జిల్లా న్యాయస్థానం కార్యనిర్వహణ న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద సూచించారు.
హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద సూచన
సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ సూరేపల్లి నంద
వనపర్తి పట్టణం, న్యూస్టుడే : న్యాయవాదులు, న్యాయమూర్తులు కక్షిదారులకు నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి, వనపర్తి జిల్లా న్యాయస్థానం కార్యనిర్వహణ న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద సూచించారు. చట్టాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి చైతన్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శనివారం వనపర్తి న్యాయస్థానం ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో న్యాయశాస్త్రం అభ్యసించినవారిలో అత్యధికులు పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్మాగాంధీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న మదన్మోహన్, లాలాలజపతిరాయ్, సురేంద్రనాథ్బెనర్జీ, మోతీలాల్నెహ్రూ తదితరులు న్యాయవాదులేనన్నారు. తొలి ప్రధాని నెహ్రూతో పాటు భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ సైతం న్యాయశాస్త్రం చదివినవారేనన్నారు. లోక్ అదాలత్ల ద్వారా ప్రజలకు న్యాయ సేవలందుతున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడం, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరిచారు.
తీర్పుల్లో జాప్యం..
జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసులు పెరగడం, న్యాయమూర్తుల నియామకం లేకపోవడం తదితర కారణాలతో తీర్పుల్లో జాప్యం జరుగుతోందన్నారు. అయితే ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాయని, ఇది శుభపరిణామమన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కేసుల పరిష్కారంలో బాధ్యతాయుతమైన పాత్రపోషించి స్ఫూర్తిగా నిలవాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ కోర్టుల్లో కక్షిదారులకు అవసరమయ్యే వసతులను ప్రణాళికాబద్ధంగా కల్పించడం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జిల్లా కోర్టు వద్ద సీసీ రహదారి, మహిళా న్యాయవాదుల వసతిగది, న్యాయ సేవల సహాయ కేంద్రం ప్రారంభించారు. ఓ దివ్యాంగుడికి మూడుచక్రాల సైకిల్ పంపిణీచేశారు. అనంతరం వనపర్తి, గద్వాల న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుజేబ్ అహ్మద్ఖాన్, న్యాయమూర్తులు రజని, రవికుమార్, శిరీష, జేసీ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.భరత్కుమార్, కె.విజయభాస్కర్, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్వేడి
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు