ఆగని ఇసుక అక్రమ రవాణా
అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒక ట్రాక్టర్కు రోజుకు ఒక అనుమతి తీసుకొని 10 ట్రిప్పులు తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
పగలు ట్రాక్టర్లు, రాత్రిళ్లు టిప్పర్లు
అధికారుల అండతో యథేచ్ఛగా తరలింపు
కృష్ణా తీరం నుంచి రామాపురం మీదుగా వస్తున్న ట్రాక్టర్లు
న్యూస్టుడే, పెబ్బేరు: అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒక ట్రాక్టర్కు రోజుకు ఒక అనుమతి తీసుకొని 10 ట్రిప్పులు తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పగలు ట్రాక్టర్లతో కృష్ణానది తీరం నుంచి ప్రకృతి సంపదను తరలించి భారీగా నిల్వలు చేసి రాత్రిళ్లు పొక్లెయిన్తో టిప్పర్లకు లోడు చేస్తున్నారు. అనంతరం పట్టణాలు, నగరాలకు తరలిస్తున్నారు. అది కూడా ఊకచెట్టువాగు పేరుతో అనుమతి తీసుకొని కృష్ణానది తీరం నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తరహా దందా పెబ్బేరు సమీపంలోని రామాపురం, రంగాపురం గ్రామాల శివారులోని కృష్ణా తీరం నుంచి సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న రవాణాతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. అధికారులు మామూళ్లకు అలవాటు పడి దందాదారులకు తెరచాటుగా సహకరిస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి నష్టం కలుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో రెవెన్యూ, పోలీసు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతీ ట్రాక్టర్కూ ఓ లెక్కుంది..
రెవెన్యూ కార్యాలయంలో ఇసుక కోసం అనుమతి కోరుతూ ఆఫ్లైన్లో ఒక ట్రాక్టర్కు రోజుకు రూ.2 వేలు రుసుంగా చెల్లించి పత్రం తీసుకుంటున్నారు. ఆ ఒక్క అనుమతి చూపించి రోజుకు ఎన్ని ట్రిప్పులైనా తరలించుకోవచ్చనేలా దందా సాగుతోంది. రామాపురం, రంగాపురం శివార్లలో భారీగా ఇసుక నిల్వలు ఉన్నా దాడులు చేయకపోవడంతో రెవెన్యూ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు గ్రామాల ట్రాక్టర్ల యజమానులు నిల్వలు చేస్తుంటే రాత్రిళ్లు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వ్యాపారులు పొక్లెయిన్ సాయంతో టిప్పర్లకు లోడ్చేసి వనపర్తి, గద్వాల, జడ్చర్ల పట్టణాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడ తరలిస్తున్నారు. రాత్రిళ్లు నడిచే టిప్పర్లకు ఓ పోలీసు ఉన్నతాధికారి అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిప్పర్ల వ్యవహారంపై ప్రతక్షంగా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో కొందరు వైరల్ చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదు. ఈ రెండు గ్రామాలకు సంబంధించి రోజుకు 100 ట్రాక్టర్లు, రాత్రిపూట టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుంటే పోలీసులు మాత్రం నెలకొక ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదుచేసి మమ అనిపిస్తున్నారు.
రంగాపూర్ సమీపంలో ఇసుకను దించుతున్న ట్రాక్టరు
చర్యలు తీసుకుంటాం..
- పద్మావతి, ఆర్డీవో, వనపర్తి
పెబ్బేరులోని కృష్ణానదీ తీరం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై ఇప్పటికే దృష్టి పెట్టాం. అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. రామాపురం, రంగాపురం గ్రామాల శివార్లలో ఇప్పటికే నిల్వలున్న ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించాను. వారితో ముందుగా పరిశీలన చేయిస్తాం. ఎక్కడెక్కడ నిల్వలు చేశారో గుర్తించి ఆయా వ్యక్తుల నుంచి వివరణ కోరుతాం. అనుమతి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఇసుక తరలించేలా చూడాలని అధికారులకు సూచిస్తాం. దందాకు అడ్డుకట్ట వేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్