క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
క్యాన్సర్ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించి క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని విప్ గువ్వల బాల్రాజు అన్నారు.
సమావేశంలో పాల్గొన్న విప్ గువ్వల బాల్రాజు, పక్కన కలెక్టర్ ఉదయ్కుమార్
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : క్యాన్సర్ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించి క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని విప్ గువ్వల బాల్రాజు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ రోగులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సకాలంలో పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్కు అడ్డుకట్ట వేసే దిశగా ముందుకెళ్లాలన్నారు. చిన్న వయస్సులో వివాహాలు చెయ్యడం, వంశపారంపర్యం, ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉండే మహిళలకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. రసాయన, క్రిమి సంహారక మందులు, పొగాకు, మత్తు పానియాలను తీసుకోవడం వల్లనే వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని తెలిపారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మహిళల్లో వ్యాధులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణ, సాధికారతకు ట్రస్టు ఛైర్పర్సన్ గువ్వల అమల ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. మహిళల సంక్షేమానికి ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించనున్నట్లు భరోసానిచ్చారు. భవిష్యత్లో ఉచితంగా మండలాల్లో క్యాన్సర్ పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్యాన్సర్ నివారణకు 11 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వరకు హెచ్.పి.వి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. పుర ఛైర్మన్ నర్సింహాగౌడ్, మార్కెట్ ఛైర్పర్సన్ అరుణ, ఎంపీపీ శాంతాబాయి, డీడబ్ల్యూవో వెంకటలక్ష్మి, ఆర్డీవో పాండు, తహశీల్దారు కృష్ణయ్య, నేతలు మనోహర్, రాజేశ్వర్రెడ్డి, పర్వతాలు, లోక్యానాయక్, రమేశ్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు