పాలమూరుకు వరాలు గుప్పించేనా..!
శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్పై పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు.
ఇప్పటికీ నెరవేరని గత హామీలు
రేపు రాష్ట్ర బడ్జెట్
పాలమూరు విశ్వవిద్యాలయం
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్పై పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 13 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఎన్నికల సందర్భంగా పలు హామీలను ముఖ్యమంత్రి ఇచ్చారు. అందులో కొన్ని నెరవేరగా మరికొన్ని అలాగే ఉన్నాయి. వాటికి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
గూటికి చేరేదెన్నడో..
పాలమూరు జిల్లాలకు 20,123 రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. నిధుల కొరతతో వీటి నిర్మాణం నత్తనడకన చేపడుతున్నారు. కొన్నిచోట్ల పునాది, పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. ఇవి పూర్తి కావాలంటే ఉమ్మడి జిల్లాకు బడ్జెట్లో సుమారు రూ.700 కోట్లు అవసరం. నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో అసలు ఇళ్ల నిర్మాణం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
‘మన ఊరు-మన బడి’కి..
‘మన ఊరు-మన బడి’కి గత బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిపిన 20శాతం పాఠశాలల్లో కూడా పనులు పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,099 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 200 పాఠశాలల పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావాలంటే అదనంగా మరో రూ.400కోట్లు అవసరం ఉంటాయి.
అమలుకు నోచుకోని..
నారాయణపేట జిల్లాలోని జయమ్మ, ఊట్కూరు జలాశయాలను ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు. వీటి కోసం సుమారు రూ.25 కోట్లు అవసరం. దేవరకద్ర నియోజకవర్గంలో పర్థిపూర్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు కూడా ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తి మినహా ఎక్కడా మంజూరు కాలేదు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి, కొల్లాపూర్లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అమలుకు నోచుకోలేదు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ట్రామాకేర్ సెంటర్కు ప్రత్యేక నిధులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 4 వేల మంది యువకులు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటికోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు అవసరం. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల పనులు, వంతెన పనులకు సుమారు రూ.200 కోట్లు అవసరం.
పీయూకు నిధులొచ్చేనా..
పాలమూరు యూనివర్సిటీకి ఏటా కేటాయిస్తున్న నిధులు అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదు. అరకొర నిధులతో యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులతో సహా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టలేకపోతున్నారు. 2020-21లో రూ.7.36 కోట్లు, 2021-22లో రూ.7.58 కోట్లు, 2022-23లో రూ.9.85 కోట్లు కేటాయించారు. ఈ సారి రూ.84 కోట్లు కావాలని వర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
సాగునీటి ప్రాజెక్టులపైనే ఆశలు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్న ఉదండాపూర్ జలాశయం
కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఆగస్టులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు. తర్వాత పనులు అనుకున్నంత వేగంగా జరగలేదు. 2020-21లో రూ.368 కోట్లు, 2021-22లో రూ.960 కోట్లు, 2022-23లో రూ.1,400 కోట్లను కేటాయించారు. ఈ పనులు పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2015లో రూ.35,200 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించగా ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా విలువ రూ.52 వేల కోట్లకు చేరింది. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు భారీగా అవసరం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఆన్గోయింగ్ ప్రాజెక్టుల అదనపు ఆయకట్టుకు మరో రూ.2 వేల కోట్లు అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.