పర్యావరణంపై కాలుష్య పంజా
పాలమూరు జిల్లాల్లో ఇటుక బట్టీల నిర్వహణ పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోంది. ఇష్టారాజ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.
ఇటుక బట్టీలతో వాహనదారుల ఇబ్బందులు
యథేచ్ఛగా కలప, నల్లమట్టి తరలింపు
రహదారి పక్కనే ఇటుక బట్టీ
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: పాలమూరు జిల్లాల్లో ఇటుక బట్టీల నిర్వహణ పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోంది. ఇష్టారాజ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి ఇటుక బట్టీలు ఉన్నాయి. కొన్ని అటవీ ప్రాంతాల సమీపంలో, మరికొన్ని ప్రధాన రహదారికి ఆనుకుని ఇటుక బట్టీలను నెలకొల్పుతున్నారు. వీటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం పడుతోంది. మరోవైపు అటవీ ప్రాంతాల్లో కలపను యథేచ్ఛగా నరికి తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారు. చెరువుల్లోని నల్లమట్టిని కొల్లగొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు వీటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారులపై.. : నారాయణపేట జిల్లాలో ప్రధాన రహదారి వెంట ఎక్కడ చూసినా ఇటుక బట్టీలే దర్శనమిస్తాయి. వనపర్తి జిల్లాలోనూ కొత్తకోట-ఆత్మకూరు దారిలో పెద్ద ఎత్తున ఇవి ఉన్నాయి. గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ప్రధాన రహదారికి ఆనుకుని బట్టీలు పెట్టారు. ట్రాక్టర్లలో ఇటుక త్వరగా తరలించవచ్చన్న ఉద్దేశంతో రోడ్డుకు ఆనుకోని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రధాన రోడ్ల పక్కనే ఇటుకల తయారీతో వస్తున్న దుమ్ము, ధూళి గాలిలో వ్యాపించి రోడ్లపైనే వెళ్లే వాహనదారులకు అసౌకర్యంగా మారుతోంది. వాహనదారులు ఈ ప్రాంతాల మీదుగా రాకపోలకు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారికి 800మీటర్ల దూరంలో బట్టీలను ఏర్పాటు చేయాలి. రెండు ఇటుక బట్టీల మధ్య దూరం కిలో మీటర్కుపైగా ఉండాలి. ఇలాంటివేవీ ఉమ్మడి జిల్లాలో చాలా బట్టీల్లో అమలు కావడం లేదు.
కలప అక్రమ రవాణా.. : బట్టీలో ఇటుకలను కాల్చడానికి పెద్ద ఎత్తున కలప అవసరం. బొగ్గు ధరలు ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు కలపపైనే ఆధారపడుతున్నారు. ఇటుక వ్యాపారులు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న బట్టీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల ద్వారా చెట్లను, మొక్కలను నరికిస్తున్నారు. కొందరు సామిల్ యజమానులు కూడా ఇటుక బట్టీలకు అక్రమంగా కలపను అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
చెరువుల్లో నల్లమట్టి తరలిస్తూ.. : ఇటుకల తయారీకి చెరువుల్లో ఉండే నల్లమట్టి కీలకం. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి ఈ మట్టిని తరలించుకోవాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో మక్తల్లో పెద్ద చెరువు నుంచి నల్లమట్టిని తీసి ఇటుకబట్టీల వ్యాపారం ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నాగర్కర్నూల్ జిల్లాలోనూ ఓ ప్రజాప్రతినిధి అండతో నల్లమట్టి యథేచ్ఛగా కొల్లగొట్టి ప్రాజెక్టులతోపాటు ఇటుకబట్టీ వ్యాపారులకు అందించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నల్లమట్టిని తరలిస్తున్నారు. గద్వాల శివారు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వేసవి ప్రారంభం అవుతుండడంతో మళ్లీ చెరువుల్లోని నల్లమట్టిపై బట్టీ నిర్వాహకుల కన్ను పడింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్(ఈఈ) సంగీతను ‘ఈనాడు’ వివరణ కోరగా ఇటుక బట్టీల్లో కాలుష్యంపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. సాధారంగా అక్కడ పీసీబీ అధికారులు తనిఖీలు చేసిన ఘటనలు లేవని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ