logo

కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం

ఆది శిలాక్షేత్రంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం కనులపండువగా జరిగింది.

Updated : 06 Feb 2023 06:31 IST

మల్దకల్‌ : శ్రీదేవి, భూదేవి సమేత ఆదిశిలావాసుడు

మల్దకల్‌, న్యూస్‌టుడే : ఆది శిలాక్షేత్రంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, శాంతిహోమం, శుద్ధజలాభిషేకం, పంచామృతాభిషేకాలు, అర్చన, మంగళ హారతులు, ఉత్సవ  విగ్రహాల ఊరేగింపు చిన్నరథోత్సవం ఊంజల సేవ చేశారు. భక్తులు తరలి వచ్చారు. ఈవో సత్యచంద్రారెడ్డి, ఛైర్మన్‌ ప్రహ్లాదరావు, బాబురావు, ముకుందరావు, ఉరుకుంద తదితరులు పాల్గొన్నారు.


అలంపూర్‌ : అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారికి ఆదివారం అభిషేకం, స్పర్శ దర్శనం, జోగులాంబ అమ్మవారికి త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహించారు. జోగులాంబకు ఒడిబియ్యం, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చండీహోమంలో 92 మంది భక్తులు హోమంలో పాల్గొనడంతో ఆలయాలకు రూ.92 వేల ఆదాయం సమకూరినట్లు ఈవో, ఛైర్మన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని