logo

రూ.100 పెరిగిన వేరుశనగ ధర

వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చిన మేలిమి రకానికి చెందిన వేరుశనగలకు ఒక్క రోజులో రూ.100 ధర పెరిగింది.

Published : 06 Feb 2023 06:18 IST

వనపర్తి యార్డుకు వచ్చిన వేరుశనగ

వనపర్తి, న్యూస్‌టుడే : వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చిన మేలిమి రకానికి చెందిన వేరుశనగలకు ఒక్క రోజులో రూ.100 ధర పెరిగింది. ఆదివారం మార్కెటు యార్డుకు 8,187 బస్తాల వేరుశనగలు వచ్చాయి. వచ్చిన వాటిలో మేలిమి రకానికి గరిష్ఠ ధర క్వింటాలు ఒక్కంటికి రూ.8,290 ధర పలికింది. ఇది శనివారం రూ.8,190గా ఉంది. ధరలు నిలకడగా ఉండేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. వచ్చిన వాటిలో కనిష్ఠ ధర రూ.5,305గా, మాదిరి రకానికి చెందిన వాటికి రూ.7,297 ధర ఉన్నట్టు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి లక్ష్మయ్యగౌడ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని