దుబాయి కరెన్సీ మార్పిడి పేరుతో మోసం
దుబాయి కరెన్సీ మార్చుకుని లాభపడాలనుకున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తి నిలువునా ముంచాడు.
రూ.5 లక్షలతో పరారీ
బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న జడ్చర్ల సీఐ రమేశ్బాబు
జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే: దుబాయి కరెన్సీ మార్చుకుని లాభపడాలనుకున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తి నిలువునా ముంచాడు. వారి నుంచి రూ.5 లక్షలు తీసుకుని ఉడాయించిన ఘటన ఆదివారం జడ్చర్లలో జరిగింది. సీఐ రమేశ్బాబు, ఎస్సై లెనిన్ కథనం మేరకు వివరాలు.. మహబూబ్నగర్లోని మదీన మసీదు సమీపంలో నివాసం ఉంటున్న సిరాజుద్దీన్ ఆప్టికల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈయనకు వద్దకు వారం రోజుల క్రితం గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తన వద్ద దుబాయ్ కరెన్సీ (దిర్హమ్) ఉందని, వాటిని తీసుకుని ఇండియన్ కరెన్సీ ఇవ్వాలని కోరాడు. కరోనా సమయంలో తన వద్ద దిర్హమ్స్ ఉండి పోయిందని చెప్పుకొచ్చాడు. తన వద్ద ఉన్న దిర్హమ్స్ను చూపించాడు. ఇండియన్ రూపాయి విలువ ప్రకారం సుమారు 35 లక్షల వరకు ఉంటుందని, వాటిని తీసుకొని రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాడు. జడ్చర్లలోని రైల్వేగేటు సమీపంలో గ్రంథాలయం వద్దకు రావాలని సిరాజుద్దీన్, ఆయన భార్య యాస్మిన్ను సూచించాడు. అక్కడికి ఎందుకు రావాలని వారు ప్రశ్నించడంతో దిర్హమ్స్ అక్కడే ఉన్నాయని తప్పుదోవ పట్టించాడు. అత్యాశకు పోయిన వారు ఆదివారం జడ్చర్లకు చేరుకుని రూ.5 లక్షలు దుండగుడికి ఇచ్చారు. అతను దుబాయి కరెన్సీ ఉందని ఓ సంచి ఇచ్చాడు. వారు సంచి తెరచి చూడగా అందులో కాగితాలు కనిపించాయి. దుండగుడిని పట్టుకునేందుకు యత్నించగా అతను మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రమేశ్బాబు, ఎస్సై లెనిన్ బృందం ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేశారు. ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులు మోసం చేశారని గుర్తించారు. ఆప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై పారిపోతున్నట్లు గుర్తించారు. బాధితురాలు యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?