ఉపాధి ప్రణాళిక ఖరారు
జాతీయ ఉపాధిహామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను ఖరారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉపాధి పనుల కేటాయింపు, గుర్తింపునకు గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 27.20 లక్షల పనిదినాలు
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే
పనుల్లో నిమగ్నమైన కూలీలు (పాత చిత్రం)
జాతీయ ఉపాధిహామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను ఖరారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉపాధి పనుల కేటాయింపు, గుర్తింపునకు గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు స్థానికంగా కూలీలకు పనులు కల్పించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో 27 లక్షల 20 వేల 943 పని దినాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతేడాదితో పోలిస్తే 4.68 లక్షల పని దినాలు తగ్గించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 31 లక్షల 88 వేల 285 పని దినాలను కల్పించాలని ప్రణాళికలు రూపొందిస్తే జనవరి 31 నాటికి 25,70,664 పని దినాల్లో ఉపాధి పనులు జరిగాయి. మార్చి 31 నాటికి మిగిలిన పని దినాలకు సంబంధించిన పనులు గ్రామాల్లో కొనసాగించి లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే మండలాలవారీగా ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి పనులు గుర్తించి కూలీలతో చేయించడానికి కసరత్తు ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో 100 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 నుంచి కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పనులకు సంబంధించి కొత్త సాప్ట్వేర్ను రూపొందించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టీఎస్ రాగాస్ సాప్ట్వేర్తో పనులు చేపట్టేవారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవి. ఈ విధానంతో కూలీలకు సకాలంలో వేతనాలు అందలేదని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సాప్ట్వేర్ను తొలగించి దాని స్థానంలో కొత్త సాప్ట్వేర్ ఎన్ఐసీతో పనులు చేపట్టనున్నారు. ఈ విధానంలో కూలీలకు బ్యాంకు ఖాతాలో వేతనాలు అందించేందుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ నెల 1 నుంచి ఆధార్తోనే కూలీలకు వేతనాలు చెల్లించే ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పనులు ఇలా : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది చెరువులు, పంట కాలువల పూడికతీత, అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు పెంచడానికి ట్రెంచ్ల నిర్మాణాలు, వరద నీటి మళ్లింపు కాలువలు, నీటి కుంటల నిర్మాణం, ఇంకుడు గుంతలు, హరితహారానికి గుంతలు తవ్వడం, వ్యవసాయ పంటపొలాలకు నూతన రోడ్ల నిర్మాణాలు, కూలీలు ఎక్కువగా అవసరమయ్యే పనులు ఈ ఏడాది చేపట్టనున్నారు.
ఎక్కువ పని దినాలు కల్పిస్తాం : 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎక్కువగా పనులు కల్పించేందుకు ఉపాధి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులను గుర్తించడం జరిగింది. అన్ని మండలాల అధికారులకు మార్గదర్శకాల ప్రకారం పనులు చేపట్టాలని సూచనలు ఇచ్చాం.
నాగేంద్రం, ఇన్ఛార్జి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్