గుట్టుగా గర్భవిచ్ఛిత్తి..!
మూడేళ్ల క్రితం పెబ్బేరులో ఓ ఆసుపత్రి వారు ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేస్తుండగా.. సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వెళ్లి, ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు.
అనుమతులు లేకున్నా చేస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు
వనపర్తి, వనపర్తి న్యూటౌన్ - న్యూస్టుడే
ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు
మూడేళ్ల క్రితం పెబ్బేరులో ఓ ఆసుపత్రి వారు ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేస్తుండగా.. సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వెళ్లి, ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు.
ఈనెల 4న వనపర్తి జిల్లా కేంద్రంలో గర్భవిచ్ఛిత్తి చేసిన అనంతరం ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది.
జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న సేవలపై వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గర్భ విచ్ఛిత్తికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి. వివిధ కారణాలతో మహిళలు గర్భ విచ్ఛిత్తి కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే.. వారు నిరాకరిస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భ విచ్ఛిత్తి చేయరాదని, చేస్తే చట్ట ప్రకారం వైద్యులు శిక్షార్హులవుతారని స్పష్టంగా ఉన్నా.. కొందరు ప్రైవేటు వైద్యులు బాధితుల నుంచి అందినకాడికి రాబట్టుకొని, గుట్టుగా ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
జిల్లాలో రెండు దవాఖానాలకే అనుమతి
జిల్లాలో 28 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. వీటిలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రెండు ఆసుపత్రులకు మాత్రమే గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతులున్నాయి. మిగతా వాటికి లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తూ బాధితులను దోచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు వికటించి, మహిళల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేయగా, అది వికటించి ఆమె మృతిచెందింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివి పునరావృతమవుతున్నాయి. రోగి తాలూకు బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తే కేసు నుంచి తప్పించుకునేందుకు వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు.
* కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బుకు కక్కుర్తిపడి ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గర్భం దాల్చిన వారు గ్రామాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. గర్భంతో ఉన్న మహిళ స్కానింగ్లో ఆడపిల్ల అని నిర్ధారించుకున్న తర్వాత.. పిండంలో జన్యుపరంగా లోపాలు ఉండడం, వెన్నుపూస, కపాలం ఏర్పడకపోవడం, గుండెలో రంధ్రాలు ఉండడం, ఇతర జన్యుపరమైన వ్యాధులుంటే గర్భవిచ్ఛిత్తిని గైనకాలజిస్టు, చిన్నపిల్లల వైద్యుడు, రేడియాలజిస్టుల సూచనలతో చేస్తారు. శస్త్రచికిత్స చేసిన వారిని నిరంతరం వైద్యులు పర్యవేక్షణ చేయాలి. వీటన్నింటిని ఆసుపత్రుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఒక్కో కేసుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. వివిధ పరీక్షల అవసరం లేకున్నా మందులు, వైద్యుల ఫీజులు తదితరాల పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. అయితే ఎవరికీ రసీదులివ్వడం లేదు.
నిబంధనలు ప్రచారానికే..
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమనే విషయం ప్రచారానికే పరిమితమైంది. భ్రూణ హత్యల నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యహరిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని కొన్ని దవాఖానాలు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లింగనిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల తీరు మారడం లేదు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
గర్భం దాల్చిన వారిలోని పిండాన్ని పరీక్షించి, అవసరమైతేనే.. అదీ అనుమతులున్న ఆసుపత్రిలోనే గర్భవిచ్ఛిత్తి చేయాలి. ఇతర ఆసుపత్రుల్లో చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మాకు ఫిర్యాదు చేస్తే సదరు ఆసుపత్రులను మూయిస్తాం. ఈనెల 4న జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నాం.
రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా బండ్ల గిరక పోటీలు
[ 18-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అన్నదాతలు ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నామపత్రాల సమర్పణకు వేళాయె
[ 18-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వారసత్వంపై అలసత్వం
[ 18-04-2024]
రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెట్టింది పేరు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
[ 18-04-2024]
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
మయూరి ఉద్యానం.. భద్రత కనం
[ 18-04-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. -
తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
[ 18-04-2024]
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. -
ఐటీ కారిడార్ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి
[ 18-04-2024]
నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో ఐటీ కారిడార్, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. -
పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
[ 18-04-2024]
మహబూబ్నగర్కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్ కథనం ప్రకారం.. -
నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?
[ 18-04-2024]
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. -
‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్’
[ 18-04-2024]
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్ నాయకులు ధ్వజమెత్తారు. -
తనువు చాలించిన గర్భిణి
[ 18-04-2024]
ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. -
అంతా సీతారామం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. -
దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ
[ 18-04-2024]
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!