రుణాలిప్పిస్తామంటూ భారీ మోసం
పెద్దఎత్తున రుణం ఇప్పిస్తామని నమ్మించి, మోసం చేసిన బృందంలోని ఒకరిని వనపర్తి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండుకు పంపారు.
రూ.25 లక్షల మేర రాబట్టుకున్న వైనం
బృందంలోని ఒకరి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి. వెనుక నిందితుడు (ముసుగులో)
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే: పెద్దఎత్తున రుణం ఇప్పిస్తామని నమ్మించి, మోసం చేసిన బృందంలోని ఒకరిని వనపర్తి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండుకు పంపారు. సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రానికి చెందిన సొహైల్కు స్థానికంగా ఓ ట్రాక్టరు షోరూమ్ ఉంది. విడి పరికరాల కోసం తరచూ ఆయన బెంగళూరు వెళ్లే క్రమంలో అక్కడ బర్కతుల్లా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు రూ.25 కోట్ల వరకు రుణం ఇప్పిస్తానని బర్కతుల్లా నమ్మబలికాడు. అక్కడే అజిత్, పురుషోత్తం, వినోద్కుమార్, రాజశేఖర్, నాగరాజుల అనే వ్యక్తులను సొహైల్కు పరిచయం చేశాడు. తమ ‘ఏపీఎం క్యాపిటల్ ఇండియా’ అంతర్జాతీయ సంస్థ అని నమ్మబలికి, రూ.25 కోట్ల రుణం కావాలంటే రూ.25 లక్షల వడ్డీని తొలుత చెల్లించాలని చెప్పడంతో బాధితుడు ఆమేరకు డీడీ ద్వారా చెల్లించాడు. ఈ బృంద సభ్యుడైన నాగరాజు.. పొదిలి సుధాకర్ అనే వ్యక్తితో వనపర్తికి వచ్చి సొహైల్ను కలిశాడు. రుణం ఇచ్చేందుకు ఇతర ఖర్చులకుగాను రూ.5 లక్షలివ్వాలని చెప్పి, ఆమేరకు ఖాళీ చెక్కు, ఇతర ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లాడు. రుణం విషయమై ఎంతకూ వారి నుంచి స్పందన లేకపోవడంతో సొహైల్ బెంగళూరు వెళ్లి విచారించగా.. ‘ఏపీఎం’ సంస్థను ఎత్తేశారని తెలిసి, తాను మోసపోయినట్టు గుర్తించి, వనపర్తి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. చెక్కు, ధ్రువపత్రాలు తీసుకెళ్లిన వారిలో ఒకడైన సుధాకర్ అలియాస్ శివనాయుడు(37) సోమవారం పెబ్బేరు వద్ద జాతీయ రహదారిపై టీ తాగుతుండగా గుర్తించి, వనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. నేర చరిత్ర ఉన్న సుధాకర్ గతంలో తాను సహాయ దర్శకుడినని చెప్పి సినిమాపరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాన్ని చేపట్టి నిధులు దొరికేలా బాబాలతో పూజ చేయిస్తానంటూ మోసంచేసిన కేసులో జైలుకూ వెళ్లొచ్చాడు. ఇతనిది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా. అతని నుంచి రూ.2,98,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్టు సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు. ఈ సమావేశంలో కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై యుగంధర్రెడ్డి, సీసీఎస్ ఎస్సై హృషికేశ్, ఏఎస్ఐ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కేసు ఛేదనలో ఎస్సై యుగంధర్రెడ్డి, హృషికేశ్, సీసీఎస్ హెడ్కానిస్టేబుళ్లు శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సమరసింహారెడ్డిలను అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా బండ్ల గిరక పోటీలు
[ 18-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అన్నదాతలు ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నామపత్రాల సమర్పణకు వేళాయె
[ 18-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వారసత్వంపై అలసత్వం
[ 18-04-2024]
రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెట్టింది పేరు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
[ 18-04-2024]
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
మయూరి ఉద్యానం.. భద్రత కనం
[ 18-04-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. -
తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
[ 18-04-2024]
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. -
ఐటీ కారిడార్ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి
[ 18-04-2024]
నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో ఐటీ కారిడార్, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. -
పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
[ 18-04-2024]
మహబూబ్నగర్కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్ కథనం ప్రకారం.. -
నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?
[ 18-04-2024]
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. -
‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్’
[ 18-04-2024]
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్ నాయకులు ధ్వజమెత్తారు. -
తనువు చాలించిన గర్భిణి
[ 18-04-2024]
ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. -
అంతా సీతారామం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. -
దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ
[ 18-04-2024]
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు