వడగళ్లతో అన్నదాతల్లో గుబులు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వడగళ్ల వానలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడ కురిసిన వర్షంతో వరి రైతులకు ఊరట లభించింది.
నవాబ్పేట : కొల్లూరులో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న టమాట తోట..
న్యూస్టుడే, మహబూబ్నగర్ వ్యవసాయం: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వడగళ్ల వానలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడ కురిసిన వర్షంతో వరి రైతులకు ఊరట లభించింది. శనివారం తెల్లవారుజామున కురిసిన వడగళ్లతో మాత్రం మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో అత్యధికంగా వర్షం కురిసింది. గండీడ్, హన్వాడ, బాలానగర్ మండలాల్లో వడగళ్లు పడటంతో మామిడి కాయలు నేలరాలాయి. ఇటుక బట్టీలు కూడా దెబ్బతిన్నాయి. నారాయణపేట, గద్వాల, బల్మూర్, వనపర్తి మండలాల్లోనూ మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులు రావటంతో బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి, కేతిరెడ్డిపల్లి, నేరళ్లపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయని ఉద్యాన అధికారి హిమబిందు తెలిపారు.
బాలానగర్ : పెద్దరేవల్లి సమీపంలో రాలిన మామిడి కాయలు
ఎక్వాయపల్లి గ్రామ శివారులో సుమారు 30 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వడగళ్లతో నవాబ్పేట మండలంలోని కొల్లూరు, కేశరావుపల్లి, పోమాల్, కామారం, పల్లెగడ్డ, గురుకుంట, అమ్మాపూర్, జంగమయ్యపల్లి గ్రామాల్లో కూరగాయల తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏవో కృష్ణకిశోర్ తెలిపారు. రాజాపూర్ మండలంలో భారీగా వర్షం కురిసింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. పెబ్బేరు, తాడూరు, ధన్వాడ తదితర మండలాల్లో ఉల్లికి నష్టం వాటిల్లింది. నారాయణపేటతో పాటు పలు మండలాల్లో ఉల్లిని తెంచటంతో వర్షానికి తడిసింది. రైతులు తడిసిన ఉల్లిని ఆరబెట్టారు. శుక్ర, శనివారాల్లో రైతులు మార్కెట్లకు ఉల్లి, ఇతర పంటలను పెద్దగా తీసుకురాలేదు.
రాజాపూర్ : చొక్కంపేట గ్రామంలో పడిన వడగళ్లు
మహబూబ్నగర్లో అత్యధికం : అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. గండీడ్లో 38.7, బాలానగర్ మండలంలో 24.8, హన్వాడ మండలంలో 20.6 మి.మీ, కోస్గిలో 10.0 మి.మీ., మహమ్మదాబాద్లో 17.3, నవాబుపేటలో 15.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో 1.3 మి.మీ వర్షం కురిసింది. ఇతర జిల్లాలో పెద్దగా వర్షాలు కురవలేదు. రైతులు వర్షాలు తగ్గిన తర్వాతే ఉల్లిని తవ్వాలని మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేశ్ చెబుతున్నారు. ఇప్పటికే తవ్వితే ఇళ్లు, షెడ్లలో కుప్పలాగా పోయకుండా ఆరబెట్టుకోవాలని సూచించారు. పైర్లు దెబ్బతింటే కార్బండిజమ్, మంకోజెబ్ను లేదా ఎం-45 మందును పొలాలకు పిచికారీ చేయాలన్నారు. ఇలా చేస్తే కొనలు ఎర్రగా మారవని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం