అంగన్వాడీల్లో ఆధార్ నమోదు అంతంతే
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కచ్చితమైన లెక్క తేల్చేందుకు, పోషకాహారం పక్కదారి పట్టకుండా, నిధుల ఖర్చులో పారదర్శకతకు ఆధార్ నమోదును చేపట్టాలని ప్రభుత్వం భావించింది.
పర్యవేక్షకులు లేక జిల్లాలో 15 శాతమే..
గట్టు మండలం పెంచికలపాడులో ఆధార్ వివరాలు నమోదు చేస్తున్న సూపర్వైజర్ నాగరాణి
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కచ్చితమైన లెక్క తేల్చేందుకు, పోషకాహారం పక్కదారి పట్టకుండా, నిధుల ఖర్చులో పారదర్శకతకు ఆధార్ నమోదును చేపట్టాలని ప్రభుత్వం భావించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తమ పర్యవేక్షకుల ద్వారా ఆధార్ నమోదుకు 2020 అక్టోబరులో శ్రీకారం చుట్టింది. మొదట్లో మూడు ప్రాజెక్టుల్లో ముగ్గురు సూపర్వైజర్ల ద్వారా నమోదు ప్రారంభించింది. ప్రస్తుతం ఇద్దరు అందుబాటులో లేరు. జిల్లాలో కొన్ని నెలలుగా ఒకరే నమోదు చేపడుతున్నారు. రెండున్నరేళ్లు గడిచినా 15 శాతం కూడా నమోదు పూర్తి కాలేదు.
* సూపర్వైజర్లకు ట్యాబ్, ఆధార్ నమోదు కిట్ అందజేశారు. వారు కేంద్రాలకు వెళ్లి ప్రతి రోజూ 20 నుంచి 45 మంది చిన్నారుల వివరాలు నమోదు చేయాలి. ఇప్పటి వరకు కేవలం 5 వేల లోపు చిన్నారుల నమోదు మాత్రమే పూర్తి చేశారు.
* గట్టు మండలంలో సూపర్వైజర్ నాగరాణి మాత్రమే మొదటి నుంచి నమోదు కొనసాగిస్తున్నారు. మానవపాడు, గద్వాల ప్రాజెక్టుల పరిధిలో ఆధార్ నమోదు చేసే సూపర్వైజర్లు లేరు. పర్యవేక్షకులు లేక చిన్నారులకు సంబంధించిన పక్కా లెక్కలు తేలడం లేదు.
* కేంద్రాల్లో నమోదైన చిన్నారుల పేర్లు, వారు బడికి వెళ్లినా కొందరు తొలగించడం లేదు. బడికి వెళ్లే సమయంలో ఆధార్ తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు సొంతంగా డబ్బు వెచ్చించి మండల కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది.
జిల్లాలోని మండలాలు 12
పురపాలికల సంఘాలు 4
అంగన్వాడీ కేంద్రాలు 713
ఆరేళ్లలోపు చిన్నారులు 40,700
కేంద్రాలకు వచ్చే వారు 20,300
ఇంటి వద్ద ఉండే మూడేళ్లలోపు వారు 20,400
త్వరలోనే నమోదు ప్రక్రియ
అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ వందశాతం ఆధార్ నమోదు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ప్రస్తుతం ఒక సూపర్వైజర్ ద్వారా నమోదు జరుగుతోంది. మానవపాడు, గద్వాల ప్రాజెక్టుల సూపర్వైజర్లకు కొన్ని నెలల క్రితమే సంబంధిత పరీక్ష, శిక్షణ పూర్తయ్యింది. వారికి త్వరలోనే ఆధార్ కిట్లు వస్తాయి. అవి రాగానే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.
ముషాహిదాబేగం, డీడబ్ల్యూవో, గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలయ మండపానికి భూమి పూజ
[ 24-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించేందుకు శ్రీ భ్రమరాంబిక అడిగేశ్వర స్వామి ఆలయ మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్