కూలీల నమోదు ఇక సులభతరం
ఉపాధి హమీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ను ప్రవేశ పెట్టారు.
క్షేత్రసహాయకులకు సీయూజీ సిమ్ కార్డులు
న్యూస్టుడే, గద్వాల
ధరూరు మండలంలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు
ఉపాధి హమీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ను ప్రవేశ పెట్టారు. అంతకు ముందు హాజరు చేతితో మస్టర్లలో నమోదు చేసే వారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హాజరు విధానం కూలీలను ఇబ్బందులు గురి చేస్తోంది. నిత్యం నెట్వర్క్ సతాయించటంతో హాజరు నమోదు కావడం లేదు. రోజంతా శ్రమించే శ్రామికులకు డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్ వల్ల నష్టపోతున్నామని వారు పలుమార్లు అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం హాజరు నమోదు కోసం క్షేత్ర సహాయకులకు కొత్తగా సీయూజీ (కామన్ యూజర్ గ్రూప్) సిమ్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. వీటిని త్వరలోనే ఉమ్మడి జిల్లాలోని 1,127 మంది క్షేత్ర సహాయకులకు అందజేయనున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట : యాప్ వచ్చిన తర్వాత ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పనికి కూలీ వస్తే తప్ప హాజరు నమోదు చేయటం కుదరదు. గతంలో పనులకు రాకున్నా వచ్చినట్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది కూలీలతో కుమ్మక్కై సొమ్ము కాజేసిన సందర్భాలున్నాయి. సామాజిక తనిఖీల్లో బట్టబయలైనా వసూలు అంతంత మాత్రమే. కొత్తయాప్ విధానంతో అక్రమాలను ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైంది. ఈ విధానంలో ఒక కూలీకి సంబంధించి హాజరు రెండు పూటలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే సొమ్ము వారి చేతికి అందుతుంది.
నెట్వర్క్ సమస్యతో ఇబ్బంది : కొత్తగా అమలు చేస్తున్న యాప్లో నెట్వర్క్ సమస్యతో కూలీల హాజరు నమోదులో త్రీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని క్షేత్రసహాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి కాబట్టి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేస్తున్నారు. వర్క్ ఐడీ కింద 20 మంది కూలీలకు మించితే బృంద చిత్రం నమోదు చేయాల్సి ఉండేది. ఇందులో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం ఒక వర్క్ ఐడీ కింద ఒక కూలీ పని చేసినా ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా కూలీ హాజరు ముందే నమోదు చేయాలి. అనంతరం నాలుగు గంటల విరామం తర్వాతే రెండో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 20 వేల మంది లోపే ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఏప్రిల్లో వీరి సంఖ్య రోజుకు లక్ష వరకు ఉంటుంది. అలాంటి సమయంలో నమోదు ప్రక్రియ మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు గాను క్షేత్ర సహాయకులకు కామన్ యూజర్ గ్రూప్ సిమ్ కార్డులు అందించనున్నారు. దీనిలో నెలకు 30 జీబీ వరకు డాటా అందించనున్నారు.
త్వరలో అందజేయనున్నాం.. : నెట్వర్క్ సమస్య ఉంది. కూలీల హాజరు నమోదు కాకపోతే వారికి సొమ్ము అందదు. పనులు చేసినా డబ్బు అందకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల నమోదు సవ్యంగా జరగాలంటే సీయూజీ సిమ్ కార్డులు ద్వారా సాధ్యమవుతుంది. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే క్షేత్ర సహాయకులు వాటిని ఇవ్వనున్నాం.
నాగేంద్రం, జిల్లా ఇన్ఛార్జి డీఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.