భయాందోళనలో చిన్నోనిపల్లి గ్రామస్థులు
జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు పోత్తిపోతల పథకం పరిధిలోని గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు.
చిన్నోనిపల్లి గ్రామంలోకి వెళ్లకుండా పహారా కాస్తున్న పోలీసులు
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్, గట్టు, న్యూస్టుడే: జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు పోత్తిపోతల పథకం పరిధిలోని గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు. చిన్నోనిపల్లి జలాశయం రద్దు కోరుతూ 423 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ముంపు బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు రోజులుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇతరులను ఎవరినీ రానీయడం లేదు. అధికారులు జలాశయం పరిధిలోని కట్ట, గండి పూడ్చే పనులను చేపడుతున్నారు. పనులు పూర్తయితే గ్రామంలోకి నీరొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా గ్రామ ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తారని అధికారులు భావిస్తున్నారు. 2006లోనే చిన్నోనిపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించినప్పటికీ జలాశయం పనులను పూర్తి చేయకుండా నిలిపివేశారు. ముంపు గ్రామప్రజలకు అప్పట్లోనే ఎకరాకు రూ.75 వేలు వరకు పరిహారం ఇచ్చారు. వీరికి గట్టు మండలంలోని ఎర్రగుట్ట వద్ద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా పునరావాసం కల్పించాల్సి ఉంది. ఐదేళ్ల కిందట నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. దీంతో చిన్నోనిపల్లి గ్రామస్థులు తామంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన పరిహారం తమకు సరిపోలేదని కొందరు, అసలు జలాశయం పనులను పూర్తిగా ఉపసంహరించుకోని మరికొందరు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
అధికారుల పరిశీలన
జలాశయం పనులను సోమవారం ఆర్డీవో రాములు, డీఎస్పీ రంగస్వామి పరిశీలించారు. ఆదివారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా.. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. సోమవారం పనులు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. వారి వెంట సీఐ చంద్రశేఖర్, వివిధ ఠాణాల ఎస్సైలు, ఇటిక్యాల, గట్టు తహసీల్దార్లు సుబ్రహ్మణ్యం, జుబేదార్ మహ్మద్ తదితరులు ఉన్నారు.
పోలీసుల అదుపులో 17 మంది
జలాశయం రద్దు కోరుతూ నిర్వాసితులు దీక్షలు చేస్తున్న 23 మందిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురిని ఆదివారం రాత్రి విడుదల చేసినట్లు డీఎస్పీ రంగస్వామి తెలిపారు. 60 ఏళ్లకు పైబడిన రైతులను విడుదల చేశామని చెప్పారు. మిగతావారిని త్వరలో విడుదల చేస్తామని, వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. మరో 17 మంది పోలీసుల అదుపులో ఉండటంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా వైకుంఠ నారాయణస్వామి రథోత్సవం
[ 23-04-2024]
పౌర్ణమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి రథోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. -
మామా అల్లుళ్లు.. నా సవాల్కు సిద్ధమా?: రేవంత్రెడ్డి
[ 23-04-2024]
భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. -
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM