పేదల బియ్యం పక్కదారి
పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజా పంపిణీ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. అక్రమార్కుల జేబులు నింపుతోంది.
న్యూస్టుడే, కోస్గి, కోస్గి గ్రామీణం
కోస్గిలో పట్టుబడిన రేషన్ బియ్యం (పాతచిత్రం)
పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజా పంపిణీ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. అక్రమార్కుల జేబులు నింపుతోంది. ప్రభుత్వం రూ.కోట్లు రాయితీ భరిస్తూ చౌక ధరల దుకాణాల ద్వారా వాటిని పేదల కోసం పంపిణీ చేస్తుంటే.. లబ్ధిదారులకు డబ్బు ఆశ చూపుతూ కొందరు తక్కువ ధరకు ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి, మిల్లుల్లో మర ఆడించి సన్నబియ్యంగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మరికొందరు మిల్లర్లే ఆ బియ్యాన్ని వ్యాపారుల ద్వారా కొనుగోలు చేసి, ప్రభుత్వానికి సీఎంఆర్గా అందిస్తూ.. మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో అక్రమార్కులు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాను సాగిస్తున్నారు. మద్దూరు, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్, పరిగిలకు చెందిన బడా వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి, కర్ణాటక, మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ఏడాది కాలంలోనే బియ్యం అక్రమ తరలింపుపై 60కి పైగా కేసులు నమోదు కాగా, రెండు వేల క్వింటాళ్లకు పైగా బియాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే దందా ఏతీరుగా సాగుతుందో అర్థమవుతోంది. దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా, పీˆడీ యాక్టు వంటి కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు ఏమాత్రం జంకడం లేదు. ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారుల నుంచి కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ముడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే.
అక్రమాలు ఇలా..
* ఈ ఏడాది జనవరి మాసంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి కోస్గిలోని ఓ వ్యాపారి నుంచి 64 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేయించారు.
* ఫిబ్రవరి 13న కోస్గిలోని రెండు దుకాణాల్లో 13 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇటీవల పట్టణంలోని ఇద్దరు వ్యాపారులు, అమ్లికుంట్ల గ్రామంలో మరో వ్యాపారి ఇంట్లో డీఎస్వో శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి, ఏకంగా 153 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. పుర విలీన గ్రామం సంపల్లి శివారులోని ఓ తోటలో వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన ఓ బడా వ్యాపారి గోదాంను అద్దెకు తీసుకొని రేషన్ బియ్యం తరలిస్తుండగా యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడిచేసి, రెండు డీ…సీఎంలలో 124 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న విషయం విధితమే. బొల్వాన్పల్లిలో ఓ రైతు పొలంలో 45 క్వింటాళ్ల నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
* ఈ ఏడాది ఫిబ్రవరి 17న మాగనూరు మండలం ఓబుళాపురం గ్రామస్టేజీ వద్ద 480 బస్తాల బియ్యాన్ని అధికారులు పట్టుకొని ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించారు.
* మక్తల్ పట్టణంలో కొందరు ఆటోల్లో బియ్యం తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
* నారాయణపేట నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 20 కింటాళ్లు, మరో వాహనంలో 14 క్వింటాళ్లు, పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
* ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్లు, మరికల్ మండలం అప్పంపల్లి వద్ద వాహనంలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసారు.
* దామరగిద్ద మండల కేంద్రంలోనూ మూడు కేసులు నమోదు అయ్యాయి.
కార్డు రద్దు చేస్తాం.. : ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకోవాలి. ఎవరైనా అక్రమంగా కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల దాడులు చేసి పలువురిపై కేసులు నమోదు చేశాం. వారు మళ్లీ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే పీడీ యాక్టు కేసులు పెడతాం. రేషన్ బియ్యం అమ్మిన వారి వివరాలు తెలిపితే వారి కార్డు రద్దు చేస్తాం.
శివప్రసాద్రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు