క్రికెట్ మైదానానికి మెరుగులు
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)కు ఉప్పల్ స్టేడియం తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఏకైక మైదానం మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం స్టేడియ(ఎండీసీఏ)మే.
నిర్మాణం పూర్తయిన వేదిక, టర్ఫ్ వికెట్ పిచ్లు
న్యూస్టుడే, మహబూబ్నగర్ క్రీడలు
మైదానంలో నిర్మాణం పూర్తయిన వేదిక
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)కు ఉప్పల్ స్టేడియం తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఏకైక మైదానం మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం స్టేడియ(ఎండీసీఏ)మే. ఆరేళ్ల క్రితం ఈ మైదానం అందుబాటులోకి వచ్చినా మౌలిక సదుపాయాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. జిల్లా క్రికెట్ సంఘం సభ్యుల కృషితో మైదానం రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే టర్ఫ్, యాస్ట్రో టర్ఫ్ పిచ్లు, క్రీడా వేదిక, బౌలింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. గదుల నిర్మాణం పూర్తయితే క్రీడాకారుల ఇబ్బందులు తొలగనున్నాయి.
రంజీ మ్యాచ్లకు అనువుగా.. : ఎండీసీఏ మైదానంలో రూ. 12.50 లక్షలతో చేపట్టిన క్రీడాకారులు దుస్తులు మార్చుకునే గది(డ్రెస్సింగ్ రూం) పనులు కొనసాగుతున్నాయి. దీనికి ఆనుకునే మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. రెండు నెలల్లో క్రీడాకారులకు ఈ డ్రెస్సింగ్ రూం అందుబాటులోకి రానుంది. గతంలోనూ మట్టి వేయించడంతో మైదానానికి ఓ రూపం వచ్చింది. ఈ మైదానం మధ్యలో త్వరలో క్రీడాకారులు మ్యాచ్లు ఆడుకునే వీలుగా టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేసేందుకు ఎండీసీఏ ప్రతినిధులు కృషిచేస్తున్నారు. మైదానాన్ని చదును చేసి పచ్చగడ్డి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రాష్ట్ర, రంజీ స్థాయి మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహిచేందుకు అవకాశం ఉంటుంది.
దాతల సాయంతో నిర్మాణాలు.. : టోర్నీల సమయంలో షామియానాల ఏర్పాటుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి స్పందించి తన ఎంపీ ల్యాడ్ నిధులు రూ. 5 లక్షలు కేటాయించగా మైదానంలో వేదిక నిర్మించారు. దాతల సాయంతో మైదానంలో క్రీడాకారుల సాధనకు రెండు టర్ఫ్ వికెట్లు, మరో రెండు యాస్ట్రో టర్ఫ్ వికెట్ పిచ్లను నిర్మించారు. క్రీడాకారులు బౌలింగ్ సాధనకు దాతల సాయంతో రూ. 8 లక్షల విలువైన రెండు బౌలింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మైదానంలో టర్ఫ్, యాస్ట్రో టర్ఫ్, బౌలింగ్ యంత్రాలు, వేదికలు రూపుదిద్దుకున్నాయి. డ్రెస్సింగ్ రూం నిర్మాణం కూడా పూర్తయితే క్రీడాకారులు నిత్యం ఉదయం, సాయంత్రం మైదానానికి వస్తూ సాధన చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే సమయంలో ఇతర జిల్లాల క్రీడాకారులు రాత్రి ఇక్కడే వసతి పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
పచ్చదనం పెంపునకు కృషి : దాతల సాయంతో ఎండీసీఏ మైదానంలో పచ్చిక పెంచటంతో పాటు టర్ఫ్ వికెట్ పిచ్లు తయారుచేస్తున్నాం. మంత్రి కృషితో డ్రెస్సింగ్రూం, ఎంపీ సాయంతో వేదిక అందుబాటులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. టర్ఫ్ పిచ్ పూర్తయితే రాష్ట్ర, రంజీ స్థాయి మ్యాచ్లను కూడా నిర్వహించుకోవచ్చు.
ఎం.రాజశేఖర్, ఎండీసీఏ కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత