‘ధరణి’పైనే ఫిర్యాదులు
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ధరణి సమస్యలపై అధికంగా ఫిర్యాదులొచ్చాయి.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఆర్డీవో నర్సింగరావు
నాగర్కర్నూల్, న్యూస్టుడే: కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ధరణి సమస్యలపై అధికంగా ఫిర్యాదులొచ్చాయి. ప్రజావాణికి కలెక్టర్ హాజరు కాకపోవడంతో కొంతమంది వినతులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ధరణికి సంబంధించిన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి. పెండింగ్లో ఉన్న పాసుపుస్తకాలు, వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్నవి అక్కడిక్కక్కడే పరిష్కరిస్తున్నారు. ప్రజావాణిలో డీఆర్డీవో నర్సింగరావు, సీపీవో భూపాల్రెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. భూముల సమస్య ఉన్నవారు వెనక్కి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడ్డామన్నారు.
కలెక్టర్ కోసం ఎదురు చుస్తున్న ఫిర్యాదుదారులు..
* లింగాల వద్ద మాకు రెండెకరాల భూమి ఉంది. ధరణిలో నమోదు కాలేదు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ చుట్టూ తిరిగి అలసిపోతున్నాం. మాకు కూలి పని చేసుకుంటేనే జీవనం గడుస్తుంది. కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడ తాము దస్త్రాలు ఆర్డీవో కార్యాలయానికి పంపించమన్నారు. ఆర్డీవో దగ్గరికి వెళ్తే మాకు ఇంకా రాలేదు తహసీల్దార్ కార్యాలయానికే వెళ్లాలని చెబుతున్నారు. తాము ఎన్ని సార్లు ఎక్కడికని తిరగాలి. ధరణిలో నా భూమిని నమోదు చేయించి న్యాయం చేయండి.
లింగమ్మ, లింగాల
* చారగొండలో జాతీయ రహదారి-167కి సంబంధించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. బైపాస్ రోడ్డుతో 30 ఇళ్లు, 35 ప్లాట్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నాం. అధికారులు తక్కువగా నష్టపరిహారం చెల్లిస్తున్నారు. అధికారులు, స్థానిక నాయకులు కుమ్మకై కొంతమందికి ఎక్కువ పరిహారం ఇస్తున్నారు. అందరికి ఒకే న్యాయం జరిగేలా చూడాలి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నష్టపోతున్న లబ్ధిదారులకు న్యాయం చేయాలి.
చారగొండ గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్