చేపల వలలో చిక్కుకుని మృత్యువాత
చేపల వేటకు వెళ్లి, వలలో చిక్కుకుపోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలంలోని కేతేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
బోయమినిగ స్వామి
పాన్గల్, న్యూస్టుడే: చేపల వేటకు వెళ్లి, వలలో చిక్కుకుపోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలంలోని కేతేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బోయమినిగ స్వామి (57) బుధవారం గ్రామ శివారులోని గుండ్ల చెరువు పక్కనున్న బావిలో సాయంత్రం చేపలు పట్టడానికి వెళ్లారు. ఆయన ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం చెరువు దగ్గరకి వెళ్లి చూడగా, అక్కడున్న బావి వద్ద ఆయన దుస్తులు, చెప్పులు కన్పించాయి. అందులో వెతకగా, వలలో చిక్కుకుపోయిన స్వామి మృతదేహం కన్పించింది. ఈయనకు భార్య, ఇద్దకు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు హెడ్కానిస్టేబుల్ రాంచంద్రయ్య తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)