భగీరథ నీరు వృథా కావల్సిందేనా?
‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేయాలనే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పట్టణంలోని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకం ద్వారా పట్టణంలో 25 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు చేపట్టారు.
కనెక్షన్లు ఇచ్చి, బిరడాలు మరిచిన వైనం
శిథిలమైన ఇంటికీ కనెక్షన్ ఇచ్చిన దృశ్యం.. ఒకటో వార్డులో గొట్టానికి బిరడా బిగించనందున మురుగుకాలువలో కలుస్తున్న తాగునీరు
అమరచింత, న్యూస్టుడే : ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేయాలనే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పట్టణంలోని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకం ద్వారా పట్టణంలో 25 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు చేపట్టారు. వార్డుల్లోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే నిబంధన ఉండడంతో 2,460 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం పూర్తైంది. ప్రతి ఇంటికీ ప్రతి రోజూ 135 లీటర్ల మేర తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. జోగినికాలనీ, గొల్లవీధి, కొత్త ఎస్సీ కాలనీల్లో పైపులైన్ కనెక్షన్లు ఇచ్చినా, ‘భగీరథ’ నీటిని సరఫరా చేయడం లేదు. పట్టణంలో గుత్తేదారు కనెక్షన్లు అయితే ఇచ్చేశారు కానీ, వాటికి బిరడాలు, పంపులు బిగించలేదు. ఇక పట్టణంలో దాదాపు 150 ఇళ్ల వరకూ శిథిలమయ్యాయి. కొన్ని పాడుబడ్డాయి. అయితే వీటికీ కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం. బిరడాలు లేనందున నీరు సరఫరా అయినంత సేపూ ఎంతో నీరు వృథా అవుతూనే ఉంది. విలువైన జీవజలం నేల పాలవ్వడమే కాకుండా పంపింగ్ చేసేందుకు ఎంతో విద్యుత్తు అవసరమవుతుంది. ఇది కూడా వృథాగానే పరిగణించాల్సి వస్తోంది.
ఒక్కో కనెక్షన్ నుంచి రోజూ 135 లీటర్లు..
పట్టణంలో ఆయా వార్డుల్లో ఇచ్చిన ఒక్కో కనెక్షన్ ద్వారా రోజూ సుమారు 135 లీటర్ల నీరు వృథా అవుతోందని పరిశీలకులు లెక్క కడుతున్నారు. ఒక్క 7వ వార్డులోనే చూస్తే 94,500 లీటర్ల తాగునీరు నేలపాలవుతోందని వారు పేర్కొంటున్నారు. దాదాపు పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వేసవి కాలంలో ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందిగా పరిగణించాలని, ఈ గొట్టాలకు బిరడాలు బిగించి, నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జీవజలం వృథాను అడ్డుకోండి
- కుతుబ్, అమరచింత
పట్టణంలో సరఫరా అవుతున్న ఎంతో తాగునీరు వృథా అవుతోంది. ‘మిషన్ భగీరథ’ కింద ఏర్పాటుచేసిన కనుక్షన్లకు ఎక్కడా గొట్టాలకు బిరడాలు లేవు. మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అన్ని వార్డులకు నీటిని సరఫరా చేయడం లేదు. నిర్మించిన ట్యాంకులు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. తండా వాసులకు పక్షం రోజులకూ నీటిని ఇవ్వడం లేదు. తాగునీరు మురుగు కాలువల పాలవుతోంది. బిరడాలు బిగించి, నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. జలాన్ని వృథా చేసేవారి కనెక్షన్లు తొలగించాలి.
బిరడాలు ఏర్పాటు చేస్తాం
- మహమ్మద్ ఖాజా, కమిషనర్, అమరచింత పురపాలిక
పట్టణంలో ఇచ్చిన నీటి కనెక్షన్ గొట్టాలకు వెంటనే పాలిక ఆధ్వర్యంలో బిరడాలు ఏర్పాటు చేస్తాం. నీటిని వృథాచేసే వారి కనెక్షన్లు తొలగిస్తాం. పాడుబడ్డ ఇళ్ల కనెక్షన్లు కూడా పరిశీలించి, తొలగింపచేస్తాం. ఎక్కడా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని వార్డులకూ నీరు అందేలా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..