ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన
దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
అంబేడ్కర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు..
మహబూబ్నగర్ విద్యావిభాగం, న్యూస్టుడే : దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ పట్టణంలో ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై డిక్కీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. బహుజనులు యాచకులుగా కాకుండా శాసించేవారిగా ఎదగాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారితకు కృషి చేస్తోందన్నారు. దళిత, గిరిజనులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆత్మన్యూనతాభావం వదిలి అందరితో కలిసి పని చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ఛైర్మన్ యాదయ్య, డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, మాజీ అధ్యక్షుడు కె.రవికుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రణీల్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
సదస్సుకు హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.