సేంద్రియం.. అవుతోంది వ్యర్థం
సేంద్రియ ఎరువుల వాడకంవైపు రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
మార్కెటింగ్పై దృష్టిసారించని అధికారులు
గదుల్లో వృథాగా ఉంచిన సేంద్రియ ఎరువు
పాలమూరు పురపాలకం, న్యూస్టుడే: సేంద్రియ ఎరువుల వాడకంవైపు రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే పాలమూరు పురపాలికశాఖ తడి, పొడి చెత్త సేకరణ ద్వారా మూడేళ్లుగా డంపింగ్యార్డులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఉత్పత్తి చేస్తున్న సేంద్రియ ఎరువుకు ప్రచారం కల్పించి మార్కెటింగ్ చేస్తే ఆదాయం వస్తుందన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. నిత్యం తయారు చేస్తున్న ఎరువును సంచుల్లో నింపి అక్కడే ఉన్న గదిలో నిల్వ ఉంచగా నిష్ప్రయోజనం కావడం గమనార్హం.
నిత్యం తయారీ చేస్తున్నా..
పాలమూరు పురపాలికలో నిత్యం 150 నుంచి 250 కిలోల వరకు సేంద్రియ ఎరువు తయారీ జరుగుతోంది. పురపాలికలోని 49 వార్డుల పరిధిలో ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి ప్రతి రోజూ సేకరిస్తున్న 110 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి 45 మెట్రిక్ టన్నుల వరకు తడి చెత్తను డంపింగ్ యార్డులోనే వేరు చేసి ఆరబెడుతున్నారు. తడి చెత్త ఆరిన తర్వాత పల్వరైజ్ యంత్రంతో ముక్కలు చేసి సేంద్రియ ఎరువు తయారీ షెడ్డులో ప్రత్యేకంగా నిర్మించిన గాట్లలో వరుస కుప్పలుగా పోసి వానపాములతో 40 రోజులపాటు కుళ్లబెడుతున్నారు. అలా కుళ్లిన ఎరువును జల్లెడ పట్టి ఎరువుగా తయారు చేసి సంచుల్లో నింపుతున్నారు.
ఇలా చేస్తే ఆదాయం
ఇళ్లలో పూల మొక్కలు, పెరటి తోటలు, రూఫ్గార్డెన్లకు, ఇటీవల కొందరు రైతులు సైతం సేంద్రియ ఎరువు ఉపయోగిస్తున్నారు. పురపాలకశాఖ ఈ సేంద్రియ ఎరువును 2, 5, 10, 25 కిలోల ప్యాకెట్లగా తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. పట్టణంలో తమ పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా సేంద్రియ ఎరువు విక్రయంపై ప్రచారం కల్పించాలి. ప్రస్తుతం తయారు చేస్తున్న ఎరువును హరితహారం మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగిస్తుండగా మిగతా ఎరువును సంచుల్లో నింపి వృథాగా ఉంచారు.
విక్రయానికి చర్యలు
- రవీందర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్
మెట్టుగడ్డ కూడలిలో లేదా రాయచూర్ రోడ్డులో పురపాలకకు చెందిన దుకాణాన్ని ఎంపిక చేసుకుని అక్కడ సేంద్రియ ఎరువుల సంచులు విక్రయించేందుకు నిర్ణయించాం. అయితే కార్యాచరణ అమల్లో ఆలస్యమైంది. కమిషనర్తో చర్చించి త్వరలో విక్రయానికి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.