ఎరువుల దుకాణాలుగా రైతు వేదికలు
సాగులో రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి, సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన దిగుబడి సాకారమవుతుంది.
ధరూరులోని రైతు వేదిక భవనం
ధరూరు, న్యూస్టుడే : సాగులో రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి, సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన దిగుబడి సాకారమవుతుంది. నాణ్యమైన పంటకు మద్దతు ధర లభిస్తుంది. ఆమేరకు వారిని చైతన్యం తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకు గాను రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలన్నీ ఇదే వేదిక ద్వారా నిర్వహిస్తోంది. వీటి ద్వారా వ్యవసాయ సేవలను మరింత విస్తరించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలవుతున్న మరికొన్ని సేవలు ఇక్కడ అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది.
ఎరువుల విక్రయం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు అవసరమైన ఎరువులు సగం మేర ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంస్, హాకా సేవా కేంద్రాలు ద్వారా ప్రభుత్వమే నిర్ణీత ధరలకు సరఫరా చేస్తోంది. రైతు వేదికల్లో సౌకర్యం ఉండటం వల్ల ఎరువుల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ క్లస్టర్ పరిధిలోని రైతులకు అదే క్లస్టర్ రైతు వేదిక నుంచి ఎరువులు విక్రయించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే విత్తనాలు విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎరువుల నిల్వ భద్రత వేదికల వద్దకు రవాణా తదితర అంశాలపై డీసీఎంఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ పూర్తయి ఎరువుల విక్రయాలు జరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఉన్న ఒక రైతు వేదికలో క్లస్టర్ రైతులు, సమన్వయ సమితి సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
విస్తరణ అధికారులకు బాధ్యతలు : ఎరువుల విక్రయ బాధ్యతలు విస్తరణ అధికారులకు అప్పగించనన్నట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా సాగుకు అవసరమయ్యే ఎరువులు రైతు వారీగా ఇప్పటికే విస్తరణ అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా ఎరువుల విక్రయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు.
ఆదేశాలు వస్తే అమలు చేస్తాం : రైతు వేదికల్లో ఎరువుల విక్రయం డీసీఎంఎస్ల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాలేదు. వస్తే అమలు చేస్తాం. రైతు వేదికల వద్ద విక్రయాల కోసం అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తాం.
గోవిందు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు