పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరం
అమరరాజా బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుపై మహబూబ్నగర్ మండలం ఎదిర గ్రామంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
రెండు వర్గాలుగా విడిపోయి ఎదిర గ్రామస్థుల వాగ్వాదం
పాలమూరు పురపాలకం, న్యూస్టుడే : అమరరాజా బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుపై మహబూబ్నగర్ మండలం ఎదిర గ్రామంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇటీవల తిరుపతికి వెళ్లి అక్కడి అమరరాజా పరిశ్రమను సందర్శించి వచ్చిన భారాస నాయకుల బృందం ఆదివారం వార్డు కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన యువజన సంఘాల యువకులు, ఐటీ పార్కు చుట్టూ పొలాలు కలిగిన రైతులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తిరుపతి సమీపంలోని అమరరాజా పరిశ్రమ వద్ద పరిస్థితిని భారాస నాయకులు చిన్న హన్మంతు, అల్లి ఎల్లయ్య, పెద్ద కృష్ణ, వెంకటయ్యగౌడ్ తదితరుల బృందం గ్రామస్థులకు వివరించే ప్రయత్నం చేసింది. అభ్యంతరం తెలిపిన యువకులు, గ్రామస్థులు ఎట్టి పరిస్థితిలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని స్పష్టంచేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ వల్ల జరిగిన నష్టం చాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో భారాస నాయకుల బృందానికి, గ్రామ యువకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లినంత పనిచేశారు. కొంత మంది భారాస నాయకులు మాత్రమే తిరుపతికి వెళ్లి అక్కడి పరిశ్రమను సందర్శించి వచ్చి గ్రామస్థులు, రైతులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేయటం సరికాదని, తమను మంత్రి వద్దకు తీసుకెళ్తే పరిశ్రమ విషయంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చే వారిమని గ్రామస్థులు, యువకులు పేర్కొన్నారు. తిరుపతి వద్ద అమరరాజా పరిశ్రమ సందర్శనకు పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ రమ్మని చెప్పినా సమయానికి రాలేకపోయారని, ఇప్పుడు తమను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని చిన్న హన్మంతు ప్రశ్నించారు. తాము పరిశ్రమ ఎలా ఉందో చూసి అక్కడి పరిస్థితులను తెలిపామే తప్పా ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం లేదని స్పష్టం చేశారు. చిన్న హన్మంతు వివరణతో ఏకీభవించని గ్రామస్థులు, యువకులు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, బ్యాటరీ పరిశ్రమను మాత్రమే వద్దంటున్నామని పేర్కొన్నారు. మంత్రిని కలిసి పరిశ్రమ వద్దని ముక్తకంఠంతో చెబుదామని, తిరుపతి వెళ్లిన నాయకుల బృందం కూడా తమతో కలిసి రావాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. రెండు గంటల పాటు గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమరరాజా పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రజలు రెండుగా చీలిపోయి ఆగ్రహావేశాలకు దిగడంపై విచారం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్