కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు వేళాయె!
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దే వేదికలుగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి.
మహబూబ్నగర్ : ఏనుగొండలోని కేంద్రీయ విద్యాలయం
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం: అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దే వేదికలుగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కటే విద్యాలయం ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యాలయంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. ప్రయోగాత్మక పద్ధతిలో గుణాత్మక విద్య అందిస్తారు. క్రీడలు, యోగా, స్కౌట్స్, ఎన్సీసీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇందులో చదివే విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన వారికి అయిదో ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా..
కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఇందులో ప్రవేశానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 2023 మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. ప్రవేశాలకు ఏప్రిల్ 17లోపు http://kvsonlineadmission.kvs.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. kvs admission యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* రెండో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలను మాత్రం ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. పాఠశాలలోని ఖాళీలకు అనుగుణంగా మెరిట్ ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. ఏకైక సంతానం ఉన్న బాలికలకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తులు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు అందించాలి. మెరిట్ జాబితాను ఏప్రిల్ 17న వెల్లడిస్తారు. ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
* రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి 7-9 ఏళ్ల మధ్య, నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి : ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించాం. ఎంపిక విధానం పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
దశరథరామ్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ