పదికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
పది పరీక్షలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్, ఎస్పీ
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : పది పరీక్షలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనతో కలిసి పది పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో 7,370 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పోలీసు స్టేషన్కు దూరంగా ఉన్న 13 కేంద్రాలకు పరీక్ష పత్రాల తరలింపునకు 9 రూట్లను గుర్తించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 10వ తేదీన నిర్వహించే సామాన్య శాస్త్రం పరీక్షను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు. ఎస్పీ సృజన మాట్లాడుతూ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీఈవో సిరాజుద్దీన్, డీఎంహెచ్వో డాక్టర్ శశికళ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్