కిటికీ తలుపు ఊడిపడి విద్యార్థినులకు గాయాలు
తరగతి గది కిటకీ తలుపు ప్రమాదవశాత్తు ఊడి మీద పడటంతో ఇద్దరు విద్యార్థినులు గాయాలపాలైన సంఘటన తాడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తాడూరు, న్యూస్టుడే : తరగతి గది కిటకీ తలుపు ప్రమాదవశాత్తు ఊడి మీద పడటంతో ఇద్దరు విద్యార్థినులు గాయాలపాలైన సంఘటన తాడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు భోజన విరామ సమయంలో తరగతి గదిలో కూర్చోని ఉండగా.. ప్రమాదవశాత్తు కిటకీ తలుపు ఊడి విద్యార్థిని నిత్యశ్రీ తలపై పడింది. తలకు రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు నిత్యశ్రీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిత్యశ్రీతోపాటు మరో విద్యార్థిని తలకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం పనులు సాగుతుండటంతో ప్రస్తుతం ఆ పాఠశాల నిర్వహణ స్థానిక ప్రాథమిక పాఠశాల (హెచ్సీ) భవనంలో సాగుతోంది. నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి నూతన భవనంలో పాఠశాల నిర్వహణ సాగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా