ప్రయాణం మరింత భారం
జాతీయ రహదారులపై టోల్గేట్ల ఛార్జీల పెంపు పాలమూరు జిల్లాల్లో సుమారు 57వేల మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది.
టోల్ఛార్జీల పెంపుతో నెలకు రూ.1.20కోట్ల అదనపు వడ్డన
ఉమ్మడి జిల్లాలో నాలుగు టోల్గేట్లు
57వేల వాహనదారులపై ప్రభావం
జాతీయ రహదారి-44పై ఉన్న పుల్లూరు టోల్గేటు
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: జాతీయ రహదారులపై టోల్గేట్ల ఛార్జీల పెంపు పాలమూరు జిల్లాల్లో సుమారు 57వేల మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి-44పై రాయికల్, శాఖాపూర్, పుల్లూరు పరిధిలో మూడు టోల్గేట్లు ఉన్నాయి. ఈ జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతితోపాటు ఏపీలో పలు ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. కార్లు, బస్సులు, భారీ, అతి భారీ వాహనాలు అధికంగా తిరుగుతుంటాయి. జాతీయ రహదారి-167పై మిడ్జిల్ మండలం మున్ననూరు వద్ద టోల్గేటు ఉంది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు టోల్గేట్ల వద్ద నుంచి ప్రతి రోజు దాదాపుగా మొత్తం 57,300 వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా సుమారు రూ.80 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఏప్రిల్ నుంచి ప్రభుత్వం 5శాతం టోల్ఛార్జీలు పెంచనుండటంతో వాహనదారులపై రోజుకు అదనంగా రూ.4 లక్షలు భారం పడనుంది. నెలకు రూ.1.20 కోట్లు ప్రస్తుత ఛార్జీల కంటే అదనంగా రానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 5.32 లక్షల వాహనాలు..
పాలమూరు జిల్లాలో గత పదేళ్లుగా 5.32 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అందులో సుమారు 2 లక్షల వాహనాలు రోజూ టోల్గేట్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు రోజు కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 96శాతం వాహనాలకు ఫాస్టాగ్ పూర్తయింది. కేంద్రం 2019 డిసెంబరు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను తీసుకొచ్చింది. ప్రారంభంలో పాలమూరు జిల్లాలో స్పందన తక్కువగానే ఉంది. ప్రారంభంలో కేవలం 20 శాతం మంది వాహనదారులే ఫాస్టాగ్ను తీసుకున్నారు. ప్రధానంగా జాతీయ రహదారిపైనే మూడు టోల్ప్లాజాలు ఉండడం, ఫాస్టాగ్ తీసుకున్న వారు నేరుగా వెళ్లిపోతుండటం, నగదు చెల్లించాల్సిన వాహనదారులు గంటల కొద్ది క్యూలైన్లో ఉండటంతో పలువురు ఫాస్టాగ్ వైపు మళ్లారు. 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్ను తప్పని సరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 5.10లక్షల వాహనదారులు ఫ్టాస్టాక్ తీసుకున్నారు. వీరంతా తరచూ టోల్గేట్ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.
మార్గదర్శకాల ప్రకారమే..
ఉమ్మడి జిల్లాలో మూడు టోల్గేట్లు ఉండగా మిడ్జిల్ మండలం మున్ననూరు వద్ద గతేడాది ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి-44పై ఉన్న టోల్గేట్లు మాత్రం పదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పెంచే పెంపు కొత్తగా ఏర్పాటు చేసిన మున్ననూరు టోల్గేట్కు మాత్రమే వర్తిస్తుందా? లేక నాలుగు టోల్గేట్లకు వర్తిస్తుందా అనేదానిపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. సాధారణంగా టోల్గేట్ల నిర్వాహకులు ఏటా సెప్టెంబరులో టోల్ ఛార్జీలు పెంచుతామని, మళ్లీ సెప్టెంబరులోనే పెంచాల్సి ఉంటుందని, ప్రభుత్వం తీసుకొచ్చిన పెంపుపై ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయనే దానిపై పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ