మెమూ రైలుతో తప్పని పాట్లు
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని కర్నూలు తర్వాత పెద్ద స్టేషను మహబూబ్నగర్. ఇప్పటికే ఇక్కటి నుంచి విశాఖపట్నానికి వారంతపు రైలు నడుస్తోంది.
పాలమూరు జిల్లాల్లో ఆగని కర్ణాటక సంపర్క్
కేంద్ర మంత్రి పర్యటనపై ప్రయాణికుల ఆశలు
మహబూబ్నగర్ రైల్వే స్టేషను..
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం : దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని కర్నూలు తర్వాత పెద్ద స్టేషను మహబూబ్నగర్. ఇప్పటికే ఇక్కటి నుంచి విశాఖపట్నానికి వారంతపు రైలు నడుస్తోంది. రోజు నడిచేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు పట్టుబట్టడంతో కేంద్రం విశాఖ - కాచిగూడ రైలును మహబూబ్నగర్ వరకు పొడిగించింది. 12862 మహబూబ్నగర్ - విశాఖపట్నం రైలును శనివారం సాయంత్రం 4.10 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జెండాఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రైల్వే సేవలపరంగా నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరముంది. వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లలో పరిస్థితులపై ‘న్యూస్టుడే’ కథనం.
రోజూ ఉదయం 6.40 గంటలకు మహబూబ్నగర్ - కాచిగూడ ప్యాసింజరు రైలు ఆరేళ్ల పాటు నడిచింది. దాని స్థానంలో గతేడాది అక్టోబరు నుంచి శౌచాలయాలు లేని మెమూ రైలును నడపటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గతేడాది నవంబరు 19న ‘శౌచాలయాలు లేని రైలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఏడాది జనవరి నుంచి డెమూ రైలును పునరుద్ధరించారు. పది రోజులుగా మళ్లీ మెమూ రైలునే నడుపుతున్నారు. ఉదయం 6.40 గంటలకు బయలుదేరే ఈ రైలు కాచిగూడకు చేరుకునేసరికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. మూత్రశాలలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నందున డెమూ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
* కర్ణాటక సంపర్క్ క్రాంతి వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును కర్నూలులో నిలుపుతున్నారు. ఈ రైలును జిల్లా కేంద్రాల్లోనూ ఆపాలని ప్రయాణికులతో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ద.మ.రైల్వే జీఎం, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. బెంగళూరు నుంచి దిల్లీ వరకు రాకపోకలు సాగించే ఈ రైలుకు మహబూబ్నగర్లో హాల్ట్ ఇస్తే సౌకర్యంగా ఉంటుంది.
* సికింద్రాబాద్ నుంచి కర్నూలు, రాయచూరు వయా మహబూబ్నగర్ విద్యుదీకరణ పూర్తయ్యింది. హైదరాబాద్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను మహబూబ్నగర్ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే నిత్యం హైదరాబాద్కు రాకపోకలు సాగించే వేలాది ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, విద్యార్థులకు మేలు జరుగుతుంది.
* 17435 కాచిగూడ - కర్నూలు సిటీ రైలు రాత్రి 8 గంటలకు మహబూబ్నగర్కు వస్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్తోంది. ఈ రైలు వేళలను మార్పు చేయాల్సిన అవసరముంది. కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్నగర్కు చేరుకుంటే కర్నూలు వైపు వెళ్లే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. రాత్రి 9.30 గంటలకు ఈ రైలు మదనాపురం చేరుకుంటోంది. పలు దూరప్రాంతాలు, గ్రామాల వ్యాపారులు ఇక్కడి నుంచి రైలు దిగి ఆ సమయంలో ఆటోల్లో పల్లెలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైలుకు శ్రీరాంనగర్ స్టేషన్లో హాల్టు ఇస్తే దాదాపు 8 గ్రామాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
పేరుకే జోగులాంబ హాల్టు
అలంపూర్ దేవాలయాలను సందర్శించే యాత్రికుల కోసం ఏర్పాటుచేసిన జోగులాంబ హాల్టు రైల్వే స్టేషన్లో సమస్యలు తిష్ఠవేశాయి. ప్లాట్ఫాం ఎత్తు తక్కువగా ఉండటంతో మహిళలు, వృద్ధులు పిల్లలు, సామగ్రితో దిగేందుకు, ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గుంతకల్ - కాచిగూడ, సికింద్రాబాద్ - కర్నూలు సిటీ తుంగభద్ర, కర్నూలు సిటీ - హైదరాబాద్ హంద్రీ ఎక్స్ప్రెస్లు మాత్రమే నిలుపుతున్నారు. రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జోగులాంబ హాల్టు వద్ద ఆర్వోబీ నిర్మించాలని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. స్టేషనులో సిబ్బంది కొరతతో ఇక్కడి మరుగుదొడ్లకు ఎప్పుడూ తాళాలు వేసి ఉంచుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?