అందరూ స్పందిస్తేనే ఆర్ఆర్ఆర్ హిట్
పట్టణాలను స్వచ్ఛంగా మార్చటంతో పాటు వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్.. మేరా క్లీన్ సిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పట్టణాల్లో పాత వస్తువుల సేకరణ కేంద్రాల ఏర్పాటు
భూత్పూర్లోని ఆర్ఆర్ఆర్ కేంద్రంలో పాతవస్తువులు సేకరిస్తున్న పుర సిబ్బంది
న్యూస్టుడే, భూత్పూర్: పట్టణాలను స్వచ్ఛంగా మార్చటంతో పాటు వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్.. మేరా క్లీన్ సిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పురపాలికల్లో ఆర్ఆర్ఆర్(తగ్గించు - పునర్వినియోగించు - పునరుత్పత్తికి వాడు) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లల్లో ఉండే పాత వస్తువులు, సామగ్రిని సేకరించటం, అవసరమైన వ్యక్తులకు దుస్తులు, వస్తువులు అందించి పునర్వినియోగానికి ప్రోత్సహించటం, ఇంకా మిగిలిన వాటిని రీసైక్లింగ్కు విక్రయించటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవటం ఈ కేంద్రాల లక్ష్యం. జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ పురపాలికల్లో ఈ నెల 20 నుంచి ఆర్ఆర్ఆర్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పురపాలక అధికారులు వార్డుల వారీగా పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి నుంచి పాత వస్తువులు సేకరిస్తున్నారు. ఇందుకు మహిళా సంఘాల ఆర్పీల సహకారం తీసుకుంటున్నారు. చక్కని లక్ష్యంతో ప్రారంభించిన ఈ కేంద్రాలు ప్రజలంతా స్పందించి భాగస్వాములైతేనే విజయవంతమవుతాయి. ఈ దిశగా అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరముంది.
ఏయే వస్తువులు ఇవ్వొచ్చు..? : ఇళ్లలో వృథా గా పడి ఉన్న పాత పేపర్లు, పుస్తకాలు, నోట్బుక్స్, ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, చెప్పులు, బూట్లు, బొమ్మలు, క్రీడా సామగ్రి.. ఇలా వస్తువులేవైనా ఆర్ఆర్ఆర్ కేంద్రాలకు అప్పగించవచ్చు.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే : మహబూబ్నగర్ పట్టణం వేంకటేశ్వరకాలనీ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రతి వార్డులోని కమ్యూనిటీ భవనాల వద్ద కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి పాత వస్తువులు సేకరిస్తున్నారు. జడ్చర్ల పురపాలికలో ప్రైవేటు భాగస్వామ్యంతో 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు సుమారు 600 కేజీల వరకు పాత వస్తువులు కేంద్రాల్లో జమవుతున్నాయి. భూత్పూర్లో అయిదు కేంద్రాలు ఏర్పాటు చేసి వస్తువులు సేకరిస్తున్నారు. అమిస్తాపూర్లోని తహసీల్దార్ కార్యాలయంలో శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పురాల్లో స్పెషల్ డ్రైవ్ :
స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ‘మేరీ లైఫ్ మేరా క్లీన్ సిటీ’ కార్యక్రమాన్ని పురపాలికలో అమలుచేస్తున్నాం. వార్డుల వారీగా ఆర్ఆర్ఆర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను పాత వస్తువులు సేకరిస్తున్నాం. పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి.
నూరల్ నజీబ్, పుర కమిషనర్, భూత్పూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM