4 రోజులు గడువు.. 40 శాతమే పని పూర్తి!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా జూన్ మొదటి వారంలో కొత్త ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి.
ఏకరూప దుస్తులను పరిశీలిస్తున్న అధికారులు
ధరూరు, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా జూన్ మొదటి వారంలో కొత్త ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. అయితే, ఈసారి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సకాలంలో అందే పరిస్థితి కనిపించడం లేదు. డిజైన్లో మార్పు చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతోందని, ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలి గిట్టుబాటు కావడం లేదని దర్జీలు చెబుతున్నారు. మార్కెట్లో టైలర్లు ఒక జత కుడితే కనీసం రూ.400 నుంచి రూ.850 వరకు తీసుకుంటారని, తాము రూ.50తో ఎలా కుట్టాలని ప్రశ్నిస్తున్నారు. చేసుకున్న ఒప్పందాన్ని వదులుకోలేక.. అటు దుస్తులు కుట్టలేక అడకత్తెరలో పోకచెక్కలా పరిస్థితి ఉందని వాపోతున్నారు.
డిజైన్ మార్పుతో ఎక్కువ సమయం : ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,177 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రెండు జతలు జూన్ ఒకటో తేదీ నాటికి కుట్టించి ప్రధానోపాధ్యాయులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16.03 లక్షల మీటర్ల వస్త్రాన్ని ఇప్పటికే ఆయా పాఠశాలల ఎస్ఎంసీ కమిటీల తీర్మానం మేరకు దర్జీల (ఏజెన్సీలు)కు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 40 శాతం వరకు దుస్తులు కుట్టడం పూర్తయినట్లు సమాచారం. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. అంతలోపు మిగతా 60 శాతం దుస్తులు కుట్టి పంపిణీ చేయాల్సి ఉంది. అమ్మాయిలకు, చిన్నారులకు షర్టు గౌను పట్టీలు పెట్టి చక్కగా కుట్టటం, పెద్దవారికి కాలర్పట్టీలు, కోట్ చొక్కా, జేబులు, భుజాలపై క్లాపులు, చేతి భాగంలో క్లిప్పులు చుట్టాల్సి ఉంటుంది. డిజైన్ మార్పు చేసిన కారణంగా సమయం ఎక్కువగా తీసుకోవడంతో దినసరిగా కుట్టటానికి వచ్చే కూలీలు రేటు ఎక్కువగా అడగటం వల్ల పని ముందుకు సాగటం లేదని, కనీసం రూ.200 ఇస్తే తప్ప కుట్టుకూలి గిట్టుబాటు కాదని ఒప్పందం తీసుకున్న ఏజెన్సీ మహిళలు అంటున్నారు.
సమస్య ఉంది
పాఠశాలల పరిధిలో ఎస్ఎంసీ కమిటీల నిర్ణయం మేరకు దర్జీలకు అప్పగించాం. జూన్ ఒకటో తేదీ నాటికి కుట్టిన దుస్తులు పాఠశాలకు చేర్చాల్సి ఉంటుంది. కుట్టుకూలి గిట్టుబాటు కావటం లేదని దర్జీలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా దర్జీలతో దుస్తులు కుట్టే ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సూచనలు ఇస్తున్నాం.
సిరాజుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి, జోగులాంబ గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే