ఏడేళ్లయినా.. అతీగతీ లేదు!
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు, 2016 అక్టోబరులో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
రాజోలి కస్తూర్బా పాఠశాల పనులు ఇలా..
గద్వాల న్యూటౌన్, ఉండవల్లి, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు, 2016 అక్టోబరులో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇది జరిగి ఏడేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలను ఇరుకైన అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల పరిధిలో మొదట తొమ్మిది మండలాలే ఉండేవి. అధిక జనాభా, మండల కేంద్రాలకు దూరంగా ఉన్న రాజోలి, కేటీదొడ్డి, ఉండవల్లి గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇరుకైన అద్దె భవనాలలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
* రాజోలి మండలంలో పోలీస్ ఠాణా మినహా, మిగతా కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. వ్యవసాయ కార్యాలయాన్ని ఇరుకైన భవనంలో నిర్వహిస్తున్నారు. సామగ్రితో నిండి ఉన్న గదిలోనే అధికారులుంటున్నారు. ఐకేపీ కార్యాలయాన్ని గదిలో నిర్వహిస్తున్నారు.
* ఉండవల్లిలో చిన్నపాటి పీఏసీఎస్ భవనంలో ఐకేపీ భవనం నిర్వహిస్తుండగా, సమావేశాలకు అవకాశం లేక మానవపాడుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
* కేటీదొడ్డిలోనూ సొంత భవనాలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. మూడు మండలాల్లో 12 కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
విద్యావ్యవస్థ అస్తవ్యస్తం
* కొత్త మండలాల్లో విద్యావ్యవస్థ గాడి తప్పింది. మండల విద్యాధికారులందరూ ఇన్ఛార్జులు కావడంతో పర్యవేక్షణ ఏమాత్రం ఉండటం లేదు. మూడు మండలాల్లో రూ.55 లక్షలకు పైగా వెచ్చించి ఎమ్మార్సీ కార్యాలయాలు నిర్మించినా, అవి ఎంపీడీవో, తహసీల్దార్, ఉపాధి కార్యాలయాలుగా మారాయి.
* మూడు మండలాలకు కేజీబీవీలు మంజూరైనా సొంత భవనాలు లేక ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.2.50 కోట్లకు పైగా కేటాయించారు. రాజోలిలో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా పాఠశాలను వడ్డేపల్లి కస్తూర్బాలో నిర్వహిస్తున్నారు. అక్కడ 220 మంది విద్యార్థినులకు మరుగుదొడ్లు సరిపడక అసౌకర్యానికి గురవుతున్నారు. చదువుకునేందుకు, నిద్రించేందుకు ఒకే గదులు వినియోగిస్తున్నారు.
* ఉండవల్లి కస్తూర్బాను కలుగోట్లలో నిర్వహిస్తున్నారు. కేటీదొడ్డికి మంజూరైన విద్యాలయాన్ని ర్యాలంపాడులోని నివాస గృహాల్లో నిర్వహిస్తున్నారు.
వైద్య సేవలు అంతంతమాత్రం : ప్రతి గ్రామంలోనూ వైద్య సేవలు విస్తరించాల్సి ఉండగా, కొత్త మండలాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఉండవల్లి మండలంలో 25 వేలకు పైగా జనాభా ఉన్నా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రజలు మానవపాడు, క్యాతూర్ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో వైద్యానికి పరుగులు తీయాల్సి వస్తోంది.
* కేటీదొడ్డి గ్రామాల ప్రజలు సైతం ధరూర్, గట్టు మండలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. పురిటి నొప్పులొస్తే 15 కి.మీ. దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
ఇబ్బందులకు గురవుతున్నాం : కొత్త మండలం ఏర్పాటుతో ఎంతో సంతోషించాం. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. వైద్యం కోసం మేమంతా ఇతర మండలాల్లోని పీహెచ్సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో నిర్మించినట్లుగా మండలాల్లోనూ భవనాలు నిర్మించి అభివృద్ధికి బాటలు వేయాలి.
నర్సింహులు, ఉండవల్లి
మండలాల అభివృద్ధికి కృషి : సమస్యల పరిష్కారం, మండలాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా. కొత్త మండలాల్లోనూ శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించాలని, ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రాజోలి కేజీబీవీ భవనాన్ని గుత్తేదారు వదిలేయడం సమస్యగా మారింది. ఉండవల్లిలో దాదాపు పూర్తి కావచ్చింది. ఉండవల్లి పీహెచ్సీ నిర్మాణం కోసం రూ.2.70 కోట్లు మంజూరయ్యాయి. ఉత్తర్వులు వస్తే పనులు ప్రారంభించి, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం.
అబ్రహం, ఎమ్మెల్యే, అలంపూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్