దశాబ్ది ఉత్సవాలు రేపటి తరానికి స్ఫూర్తి
రేపటి తరానికి స్ఫూర్తి నింపటానికి తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి నిరంజన్రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్రెడ్డి
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : రేపటి తరానికి స్ఫూర్తి నింపటానికి తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాల సమీపంలో ఓ ఫంక్షన్ హల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జూన్ 3న జరిగే వ్యవసాయ దినోత్సవ కార్యక్రమాన్ని గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
అడుగడుగున స్ఫూర్తి నింపాలంటే రైతు దినోత్సవం రోజున భారీగా రైతు సమీకరణ జరగాలన్నారు. డప్పులు, వాయిద్యాలతో ఎండ్లబండ్లపై ర్యాలీగా వెళ్లి జాతీయగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలు కంది, పత్తి సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మన ప్రాంతంతో సాగునీటికి కొరత లేదని, సమయానుకూలతను బట్టి పంటలు సాగు చేసేలా చైతన్యం చేయాలన్నారు. ఏ రంగంలోనైనా ప్రగతి గతంలో ఎలా ఉంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా ఉంది అనే అంశాలపై మాట్లాడాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారి శాఖ అభివృద్ధి గురించి ఉత్సవాల్లో ప్రజలకు వివరించాలన్నారు. మత్స్యకారులు బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు చేసి, ఉత్సవాలు జరపుకోవాలన్నారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు పండుగలాంటివని, మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలను క్యాలెండర్ ప్రకారం అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్ది, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రామన్ గౌడ, మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీధర్గౌడ్, పుర ఛైర్మన్ బీఎస్ కేశవ్, ఆర్డీవో రాములు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడిళి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్