ఇక సర్కారు బడిబాట
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలను కాపాడుకోవడం విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది.
న్యూస్టుడే, కొత్తకోట
మదనాపురం : బడిబాట నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు (పాతచిత్రం)
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలను కాపాడుకోవడం విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. అందుకని పాఠశాలల్లో విద్యార్థులను ఆకర్శించడం కోసం ప్రభుత్వం ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ‘ఆచార్య జయశంకర్ బడిబాట’ కార్యక్రమానికి పూనుకుంటోంది. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ 1న ఉపాధ్యాయులు సన్నాహక సమావేశం నిర్వహించుకొని, 3 నుంచి 17 వరకు రోజుకో కార్యక్రమంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను చేర్చాలని అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. మధ్యలో చదువు మానేసిన వారిని, బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. దీంతోపాటు అయిదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడానికి ప్రత్యేక కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో 15 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విస్తృత ప్రచారానికి సన్నాహాలు..
గత కొన్నేళ్లుగా విద్యార్థులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం చేపడుతున్నా ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలు కనిపించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి, మన పట్టణం - మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు చేరి వీటిని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలు సిద్ధం చేశారు.
రోజువారీ కార్యక్రమాలు ఇలా...
* పాఠశాల స్థాయిలో 1న సన్నాహక సమావేశాల నిర్వహణ.
* 3 నుంచి 9వ తేదీ వరకు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం.
* 12న మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలను మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాలి.
* 13న తొలిమెట్టు కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. తరగతులు, సబ్జెక్టుల వారీగా అభ్యసన ఫలితాల గోడ పత్రికలను ప్రదర్శించాలి. విద్యార్థుల అభ్యసన స్థాయిని తల్లిదండ్రులకు వివరించాలి.
* 14న విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించాలి. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి బాలసభలు నిర్వహించి విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలి. పాఠశాల స్థాయి పిల్లల కమిటీలు, క్లబ్లు ఏర్పాటు చేయాలి. బోధనాభ్యసన సామగ్రితో ప్రదర్శన ఏర్పాటు చేయాలి.
* 15న ప్రత్యేక అవసరాల పిల్లల నమోదుపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
* 16న ఆంగ్ల మాధ్యమ తరగతుల నిర్వహణపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
* 17న బాలికా విద్య ప్రాముఖ్యత, ఉన్నత చదువుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించి తరువాత వారు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలపై అవగాహన కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి