ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ
అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి.. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్తు దేశాన్ని ఆకట్టుకుంటోందని శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.
శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్
ప్రసంగిస్తున్న శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి.. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్తు దేశాన్ని ఆకట్టుకుంటోందని శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలోని పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 82 అంశాలపై దశాబ్ది సందేశాన్ని చదివి వినిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ తొమ్మిదేళ్లలో బలమైన అడుగులు వేశామన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో వివిధ వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలు దృష్టి సారించి, వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అధికారులు అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు చెందిన ఐదుగురిని ఆయన సన్మానించారు. బాలభవన్, ప్రగతి విద్యామందిర్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీఎం కప్ క్రీడల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన జిల్లా జట్టు క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సరిత, ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణమోహన్రెడ్డి, పుర ఛైర్మన్ కేశవ్, ఆర్డీవో రాములు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రామన్గౌడ, మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీధర్గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉపసభాపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని..
* జిల్లాలో రైతుబంధు పథకం కింద పది విడతల్లో రూ.1942.61 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ. రైతు బీమా కింద 2572 మందికి రూ.128.60 కోట్లు పంపిణీ.
* తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ఆర్డీఎస్ చివరి ఆయకట్టులో డీ/24, నుంచి డీ/40 వరకు ఉన్న 55,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.783 కోట్లతో పనులు. మొదటి దశ నిర్మాణం రూ.397 కోట్లతో పరిపాలన అనుమతులు పొంది రూ.159 కోట్లతో పనులు పూర్తి.
* జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాల్లో సాగునీరు అందించేందుకు నలసోమనాద్రి (గట్టు) ఎత్తి పోతల పథకం నిర్మాణ పనులను రూ.581.06 కోట్లతో పరిపాలన అనుమతులు తీసుకుని రూ.487.3 కోట్ల విలువైన పనులు.
* మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 319 గ్రామాల్లో ప్రతి మనిషికి రోజుకు వెయ్యి లీటర్లు, పట్టణాలలో 135 లీటర్ల తాగునీటి సరఫరా. 1,41,529 గృహాలకు నల్లా కనెక్షన్లు.
* జిల్లాలో వైద్య రంగంలో మార్పులకు శ్రీకారం. ఈ ప్రాంతంలో రూ.26.18 కోట్లతో నర్సింగ్కళాశాల, 57 ఉప కేంద్రాలకు రూ.2.79 కోట్లు మంజూరు. అలంపూర్ చౌరస్తాలో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం. కంటి వెలుగు కింద 2,83,216 మందికి కంటి పరీక్షలు.
* జిల్లాలో రూ.472.63 కోట్లతో 6 భవనాల నిర్మాణం. ఇప్పటి వరకు రూ.253.95 కోట్లతో 3 భవనాల నిర్మాణ పనులు పూర్తి.
* జిల్లాలో 2014-15లో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు విస్తీర్ణం 4,27,397 ఎకరాలు, కాగా 2022-23 నాటికి రెండు సీజన్లలో 5,56,335 ఎకరాల్లో సాగు.
* జిల్లాలో తొలివిడతగా 206 సంఘాల్లో ఉన్న 13,277 మందికి గొర్రెల పంపిణీకి రూ.165.96 కోట్లు ఖర్చు. ఈ ఏడాది ‘సి’ జాబితాలో ఉన్న 33,416 మందిని గుర్తించి వారికి రూ.584.77 కోట్లు వ్యయంతో గొర్రెల పంపిణీకి ప్రతిపాదనలు.
* జిల్లాలో 2470 రెండు పడకల గదుల నిర్మాణాలకు పంచాయతీ రాజ్ శాఖకు అనుమతులు. ఇప్పటి వరకు 605 ఇళ్ల నిర్మాణం పూర్తి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి