ఇన్నోవేషన్ పోటీలకు తొమ్మిది పాఠశాలలు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టీఎస్ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్) వారు యూనిసెఫ్, ఐఎన్క్యూయూఐ, ఎల్ఏబీ సంస్థల సహకారంతో ‘స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు.
మొక్కజొన్న వ్యర్థం నుంచి హార్డ్బోర్డ్ తయారీలో అమరవాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు (పాతచిత్రం)
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టీఎస్ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్) వారు యూనిసెఫ్, ఐఎన్క్యూయూఐ, ఎల్ఏబీ సంస్థల సహకారంతో ‘స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 2022-23 విద్యా సంవత్సరానికి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించగా, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఆలోచనలు ఇచ్చారు. తాజాగా సృజనాత్మకత ఉన్నవాటిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 ప్రాజెక్టులు ఎంపిక చేయగా.. ఇందులో 9 ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని అయిదు జిల్లాల నుంచి 2022 ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించారు. ఇన్ఛార్జి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు తమకు వచ్చిన ఆలోచనలను ఇచ్చారు. వీటికి సాధారణంగా మార్చిలో ఎంపికలు చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ప్రస్తుతం ఎంపిక చేశారు. ఎంపికైన వాటికి ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక బృందం వారు వచ్చి వారి ఆలోచనలకు, మరింత సృజనాత్మకతను జోడించేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగాలు నిలిస్తే నగదు పురస్కారాలతో పాటు అంకుర సంస్థల ఆవిర్భావానికి తోడ్పాటు అందిస్తారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వేదిక కల్పిస్తారు.
జిల్లాల వారీగా ఎంపికైన ప్రాజెక్టులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం అమరవాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు గింజలు తీసిన మొక్కజొన్న వ్యర్థాలతో హార్డ్బోర్డ్ తయారు చేసే ప్రాజెక్ట్ చేపడుతున్నారు. గద్వాలలోని బురదపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ‘ఇంటీరియల్ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అవగాహన’ కల్పించడం అనే అంశం ఎంపికైంది.
* మహబూబ్నగర్ జిల్లాలోని బోయినపల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల ఐబీఏ క్రియేషన్స్, ఇదే పాఠశాలకు చెందిన మరో బృందం వారు ఎత్తైన చెట్లను ఎక్కే బూట్ల ప్రాజెక్టు ఎంపికైంది.
* రాజాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫ్లోర్ను శుభ్రం చేసే సైకిల్ ప్రాజెక్టు ఎంపికైంది.
* నారాయణపేట జిల్లాలోని చిన్నపర్ల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్లాస్టిక్ ఏటీఎమ్ యంత్రం ప్రాజెక్ట్ ఎంపికైంది.
* నాగర్కర్నూల్ జిల్లా మాదారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఇచ్చిన నీటి ప్రవాహంలో ప్లాస్టిక్ చెత్త తొలగించే విధానం ఎంపికైంది.
* వనపర్తి జిల్లా అమరచింత ఉన్నత పాఠశాల విద్యార్థులు గతేడాది చేసిన సూపర్ డ్రైనేజ్ క్లీనర్ ప్రాజెక్టు ఎంపికవగా, ఈ సారి ఇదే పాఠశాల నుంచి సూపర్ కాటన్ ప్లకింగ్ టూల్స్ అనే ప్రాజెక్టు ఎంపికైంది. పెబ్బేరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు తాత, అవ్వలకు సహాయపడే యంత్రాన్ని రూపొందించారు. ఎంపికైన వారంతా ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?