సాగునీటి రంగంలో అద్భుత విజయాలు
జిల్లా సాగునీటి రంగంలో అద్భుత విజయాలు సాధించామని, ఫలితంగా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
వేదికపై కలెక్టర్ ఉదయ్కుమార్, విప్ గువ్వల బాలరాజు, ఎస్పీ మనోహర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ శాంతకుమారి
నాగర్కర్నూల్, న్యూస్టుడే : జిల్లా సాగునీటి రంగంలో అద్భుత విజయాలు సాధించామని, ఫలితంగా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్ కవాతు మైదానం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా అభివృద్ధి, సాధించిన విజయాలను వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది 37.35 టీఎంసీ నీటిని ఎత్తిపోయటం జరిగిందన్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పులిజాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కిలోమీటర్లు బ్రాంచి కాలువ నిర్మాణం కోసం రూ.107.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతి వచ్చిందన్నారు. అచ్చంపేట, బల్మూరు మండలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉమామహేశ్వరం, చెన్నకేశవ జలశయాలను రూ. 1,534 కోట్లతో నిర్మిస్తామన్నారు. స్టేజ్-2 కింద 14,400 ఎకరాలకు నీరందించేందుకు రూ.687 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90 టీఎంసీల నీటిని తీసుకునేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. బిజనేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకంకు రూ.76.95 కోట్లతో చేపట్టిన పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగుపడటంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. జిల్లాలో రైతు బంధు పథకంలో 2.88 లక్షల మందికి రూ. 3,236 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 4,323 మంది రైతులకు బీమా పరిహారం రూ.216.15 కోట్లు చెల్లించామన్నారు. బిజినేపల్లి మండలంలోని పాలెంలో వ్యవసాయ డిగ్రీ కళాశాలను 2015లో ఏర్పాటు చేయగా రూ.29కోట్లతో భవనం నిర్మించామన్నారు. రూ.63కోట్లతో 107500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థం గల 26 గోదాంలను సిద్ధం చేశామన్నారు.
వన్యమృగాల సంఖ్య పెరిగింది.. : హరితహారం తొమ్మిదో విడతలో రూ.45లక్షలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అడవుల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల కారణంగా వన్యమృగాల సంఖ్య పెరిగింది. పులుల గణన ప్రకారం 24 అతి పెద్ద పులులు, 118 చిరుత పులులు, రెండు వందల రకాల పక్షులను గుర్తించటం జరిగింది. మన్ననూర్ జంగల్ రిసార్ట్స్లో భాగంగా టైగర్ స్టే ప్యాకేజీని ఏర్పాటు చేశారు. ఫరహబాద్ జంగల్ సఫారీను నిర్వహిస్తున్నాం.
అందుబాటులో అధునాత వైద్యం : వైద్య సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో నాగర్కర్నూల్ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసింది. 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించింది. జిల్లాకు 124 పల్లె దవాఖానాలు వచ్చాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శాంతకుమారి, జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్లు మోతిలాల్, మనూచౌదరి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భగీరథ అద్భుతం.. : మిషన్ భగీరథ కింద జిల్లాలో 726 అవాసాలకు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. 2024 కిలో మీటర్ల పైపు లైన్లు వేసి 601 గ్రామ ట్యాంకులను నిర్మించాం. 1.92 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పట్టణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్లు, గ్రామీణా ప్రాంతాలలో వంద లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం.
చారగొండ పైలట్ మండలంలో.. : దళిత బంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. జిల్లాలో చారగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 1,407 కుటుంబాలకు రూ.140 కోట్లు సాయం చేశాం. నాలుగు నియోజకవర్గాల్లో 301 మంది లబ్ధిదారులకు రూ.30.10 కోట్లు మంజూరు చేశామన్నారు.
వందేమాతరం ఫౌండేషన్ విద్యార్థుల కోలాట ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా వైకుంఠ నారాయణస్వామి రథోత్సవం
[ 23-04-2024]
పౌర్ణమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి రథోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. -
మామా అల్లుళ్లు.. నా సవాల్కు సిద్ధమా?: రేవంత్రెడ్డి
[ 23-04-2024]
భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. -
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్