లోతట్టుపై ముందుచూపు!
ఏటా భారీ వర్షాలకు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురవుతోంది. లోతట్టు ప్రాంతాలు మునకకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలొచ్చాయి.
అయిజలో మురుగు కాలువలో పూడిక తీస్తున్న పుర సిబ్బంది
అయిజ, న్యూస్టుడే : ఏటా భారీ వర్షాలకు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురవుతోంది. లోతట్టు ప్రాంతాలు మునకకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలొచ్చాయి. మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్ల, అయిజ, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పాత పురపాలికలు కాగా భూత్పూర్, కోస్గి, మక్తల్, పెబ్బేరు, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, అలంపూర్, వడ్డేపల్లి కొత్త బల్దియాలుగా అవతరించాయి. ఓమోస్తారు వర్షాలు కురిసినా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కొత్త పురాల్లో సమస్య అంత తీవ్రంగా లేకపోయినా వరద నీరు సవ్యంగా ముందుకెళ్లే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వర్షాలు కురిసినప్పుడే హడావిడి : పట్టణాధికారులు, పాలకవర్గాలు వర్షాలు కురిసినప్పుడు హడావిడి సృష్టించి తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఈసారి రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వరద నుంచి ఉపశమనం కలుగుతుందో లేదో చూడాలి. ప్రధాన మురుగుకాలువలు, లోతట్టు ప్రాంతాల్లోని గుంతల్లో నీరు చేరకుండా నీటిని మళ్లించే చర్యలు, అంతర్గత కాలనీల్లో మురుగు కాలువల్లో పూడికతీత తదితర చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇవన్నీ పురాల్లో చేపడితే కనీసం కొంతలోకొంతైనా వరద ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పుర అధికారులు మురుగు కాలువల్లో పూడికతీత చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరద ముంపునకు కారణమయ్యే ప్రాంతాల్లో ఈ పనులు వందశాతం చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నేరుగా లోతట్టుకు నీరు రాకుండా మళ్లించే చర్యలు ఇంకా చేపట్టలేదు. చెరువులు, వాగులు, వంకలు ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో వరద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అలాంటి ప్రాంతాల్లో చర్యలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఈసారి ముప్పు తప్పదని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.
చర్యలు చేపడుతున్నాం : సీడీఎంఏ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తాం. ఏటా వరద ప్రాంతాల్లో చర్యలు చేపడుతన్నాం. ఈసారి ముందస్తుగా అయిజలో మురుగు కాలువల్లో పూడిక తీయిస్తున్నాం. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టి అక్కడ పనులకు ఉపక్రమించాం. పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటాం.
నర్సయ్య, అయిజ పుర కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్