టెంకాయ కొడితే సరిపోదు
పెరుగుతున్న జనాభా అవసరాలు, పట్టణీకరణలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైనా గుత్తేదారుల అలసత్వం
మద్దూరులో రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్రావు (పాత చిత్రం)
న్యూస్టుడే-మద్దూరు : పెరుగుతున్న జనాభా అవసరాలు, పట్టణీకరణలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైనా గుత్తేదారుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగటం లేదు. జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద, కోస్గి మండల కేంద్రాల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల తీరిది. మద్దూరు రోడ్డుకు నిధులు మంజూరై టెండర్ పూర్తయినా గుత్తేదారుల అలసత్యంతో పనులు ముందుకు సాగటం లేదు. పట్టణంలోని కోస్గి రోడ్డులో సినిమా టాకీస్ నుంచి పాతబస్టాండ్ మీదిగా నారాయణపేట రోడ్డు అధ్వానంగా ఉంది. ఖాజీపూర్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేయడానికి రూ.4.57కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది జూన్ 16న మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్లు శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా టెండర్ వేసిన గుత్తేదారుడు ముందుకు రాకపోవటంతో పనులు ప్రారంభం కావటం లేదు. మద్దూరు పట్టణం రోజు రోజుకూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.
చుట్టూ సుమారు 70 గ్రామాల ప్రజలు అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చి వెళ్తున్నారు. వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వచ్చి వెళ్తున్నా సరిపడా రహదారుల సౌకర్యం లేక ఇబ్బందులు తప్పటం లేదు. ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో పాత బస్టాండ్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా పండ్ల, పూల, కూరగాయల వ్యాపారస్తులు రోడ్డుపైనే దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రం దామరగిద్దలో రూ.రెండు కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డుపై కంకర వేసి వదిలేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోస్గి మండల కేంద్రంలో పరిగి-హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేశారు. పనులు నత్తనడకన కొససాగటంతో పట్టణ వాసులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
గుత్తేదారులపై ఒత్తిడి తెస్తాం
మద్దూరులో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడానికి గుత్తేదారునిపై ఒత్తిడి తెస్తామని ఆర్ఆండ్బీ ఈఈ రాములు తెలిపారు. ఇతర పనుల్లో గుత్తేదారునికి బిల్లులు రాకపోవటంతో మద్దూరులో పనులు జాప్యం చేస్తున్నారన్నారు. దామరగిద్దలో రోడ్డు విస్తరణ పనులు గుత్తేదారుడితో పూర్తి చేయిస్తామని ఈఈ కేవీఎన్ స్వామి తెలిపారు. కోస్గిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆర్ఆండ్బీ ఏఈ శ్వేత తెలిపారు. మధ్యేమార్గంగా పరిష్కారం కనుగొంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ